భారత్ అగ్ని క్షిపణి కంటే సమర్థవంతమైనవి, సామర్థ్యమైనవి పాక్ వద్ద ఉన్నాయంటూ చైనా వ్యాఖ్యలు చేసిన వేళ మరో ఉదంతం కలకలం రేపుతోంది. పాకిస్థాన్లోని కరాచీ ఓడరేవులో చైనాకు చెందిన అణు జలాంతర్గామి ఉన్నట్లు నిరూపించే ఓ ఫోటోతో ఒక్కసారిగా రక్షణ దళం ఉలిక్కిపడింది.
ఉపగ్రహ ఛాయాచిత్రాలను గుర్తించడంలో నిపుణుడైన ఒక వ్యక్తి గూగుల్ ఎర్త్లోకి వెళ్లి చూడగా అతడికి ఈ ఫోటో కనిపించింది. గూగుల్ ఎర్త్లో 2016 మే నాటికి వెళ్తే ఈ జలాంతర్గామి స్పష్టంగా కనిపిస్తుందన్న విషయాన్ని అతను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దాని సాయంతో చైనా ఇంతకుముందు కంటే ఇప్పుడు భారతీయ యుద్ధనౌకల కదలికలను మరింత దగ్గరనుంచి గమనిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ అణు జలాంతర్గాముల్లో రియాక్టర్ల కారణంగా ఇంధనకొరత అనే సమస్యే తలెత్తదు. అంతేకాదు, అణు జలాంతర్గాములు ఎంత దూరమైనా వెళ్లగలుగుతాయి.
టోర్పడోలు, క్రూయిజ్ మిసైళ్లు ఉన్న ఈ జలాంతర్గాములను ఎంతకాలం అయినా సరే నీటి అడుగునే ఉంచవచ్చు. అయితే, దీనిపై స్పందించిన రక్షణశాఖ అధికారులు అటువంటి వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమేనని, అక్కడ ఉన్నది అణుజలాంతర్గామేనని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. అవి బాగా నిశ్శబ్దంగా ఉండి, ఏ మాత్రం గుర్తించడానికి వీలు లేకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు దాడులు చేసే అవకాశం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక మాత్రం జారీ అయ్యింది.
నౌకాదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా గత నెలలోనే మాట్లాడుతూ... చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాముల కదలికలను భారత్ విమానాలు, నౌకల సాయంతో గమనిస్తూనే ఉందని చెప్పారు. అయితే, ఇప్పుడు
ఈ అణు జలాంతర్గామి కరాచీలో ఉండడం అలజడి రేపుతోంది. కాగా, గత పదేళ్ల కాలంలో చైనా సహకారంతో పాక్ నౌకాయాన సంబంధాలు కొనసాగించటం తెలిసిందే. 46 బిలియన్ల డాలర్లతో గ్వాడార్ పోర్ట్ వద్ద ఆర్థిక ఒప్పందం కూడా చేసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more