నోట్ల రద్దు అంశంలోకి స్వర్గీయ ప్రధానమంత్రిని లాగడంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గరభీ హటావో వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుని దేశంలో పేదరికం లేకుండా అమె చేపట్టిన చర్యలను ఇప్పటికీ దేశ ప్రజలు మర్చిపోలేరని, అమె తీసుకున్న అప్పటి నిర్ణయాలతో అమె ఇప్పటికీ దేశప్రజల మనస్సులోకూ శాశ్వతంగా గూడుకట్టుకుని వున్నారని అన్నారు. అలాంటి అధినేత్రిపై నోట్ల రద్దు అంశాన్ని ఎందుకు చేపట్టలేదని బురదజల్లేందుకు బీజేపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.
1971లో వాజో కమిటీ పెద్ద నోట్లను రద్దు చేయాలని ఇందిరాగాంధీకి సిఫార్సు చేసినా.. అమె ఆ కమిటీ నివేదికను తోక్కిపెట్టి దేశానం నాశనం చేశారన్న ప్రధానం అరోపణలపై పవార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే బీజేపి ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వానికి పనిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇంధిరా గాంధీ తరువాత కేంద్రంలో మురార్జీ దేశాయ్ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వాలు కూడా వచ్చాయని మరి వారి హాయంలో పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఇప్పుడు ఇందిరాగాంధీకి అపఖ్యాతిని మూటగట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని.. మరి వారి ప్రభుత్వ హాయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. కేంద్రంలోని ప్రభుత్వం అంటే కేవలం ప్రధాన మంత్రి ఒక్కరే కనిపిస్తున్నారని, ఆయన ఒక్కరే ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అయితే అది వారి వ్యక్తిగత విషయం.. కానీ ఇతరులను నిందించకుండా తన నిర్ణయాలను ఎలా విజయవంతం చేయాలో చూసుకోవాలని అన్నారు. దేశం మొత్తం డబ్బుల కోసం రోడ్లపైకి వచ్చి.. బ్యాంకుల ముందు క్యూకట్టాలన్నది మోడీ సర్కార్ నిర్ణయంలా వుందని ధ్వజమెత్తారు.
మీ ప్రభుత్వంలో మీరు తీసుకున్న నిర్ణయమే అయినా.. కోట్ల కోద్ది డబ్బు ఎలా అక్రమంగా తరలివెళ్లిందని, అదాయ శాఖ దాడుల్లో అదెలా భయపడుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మరణించిన ఉగ్రవాదుల వద్ద కూడా కొత్త రెండు వేల రూపాయల నోట్లు లభ్యం అయ్యాయి, మరి మీ ప్రభుత్వం ముందుచూపు, ముందు జాగ్రత్త ఎమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మీ ప్రభుత్వం డొల్లతనం ఇక్కడే బయటపడుతుందని శరత్ పవార్ ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more