మూడో రోజు టీమిండియాదే పైచేయి India 451/7 at stumps on Day 3 of 4th Test against England

India 451 7 at stumps on day 3 of 4th test against england

India vs England, 4th Test,Day 3, Team India, virat kohli, murali viijay, Cricket Scores, Mumbai Test, cricket news, sports, cricket, sports

India end day three on 451 for 7, 51 runs ahead of England with Virat Kohli making his 15th Test ton.

మూడో రోజు టీమిండియాదే పైచేయి

Posted: 12/10/2016 07:20 PM IST
India 451 7 at stumps on day 3 of 4th test against england

పర్యాటక జట్టు ఇంగ్లండ్తో ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గవ టెస్టులో మూడవ రోజు అద్యంతం టీమిండియా పైచేయి కనబర్చింది. మూడో రోజు అట ముగింపులో.. ఇంగ్లండ్ ను సాధించిన 400 పరుగుల స్కోరును సమం చేసిన విరాట్ సేన.. ముగింపు సమయానికి 51 పరుగల అధిక్యాన్ని కూడా సాధించింది. దీంతో మొత్తంగా ఏడు వికెట్ల నష్టానికి 41 పరుగులకు చేరింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడాడు.

వీరిద్దరి భాగస్వామ్యంలో మూడో వికెట్కు 116 పరుగులు జోడించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, జట్టు స్కోరు 262 పరుగుల వద్ద ఉండగా విజయ్ నిష్ర్రమించడంతో ఆపై స్వల్ప  వ్యవధిలో టీమిండియా కొన్ని కీలక వికెట్లను చేజార్చుకుంది. భారత్ ఆటగాళ్లలో కరణ్ నాయర్(13),పార్థీవ్ పటేల్(15),అశ్విన్ (0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ, రషిద్,రూట్లకు తలో రెండు వికెట్లు లభించగా, బాల్ కు వికెట్ దక్కింది. అంతకుముందు 146/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు ఆటలో ఇన్నింగ్స్ రెండో బంతికే పూజారా(47)ను బాల్ అవుట్ చేయడంతో భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. కాగా, విరాట్ పలు కీలక భాగస్వామ్యాలను సాధించడంతో టీమిండియా తేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  4th Test  Day 3  Team India  virat kohli  murali viijay  Cricket Scores  Mumbai Test  cricket  

Other Articles