కామా తురానాం న భయం న లజ్జ అన్న సంస్కృత పదాలను కూడా అర్థం చేసుకోలేని విద్యార్థినులు వాళ్లు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు. వారి చేతికి అందివచ్చిన టెక్నాలజీతో వారు బూతుపురాణం వైపు మొగ్గుచూపారు. తెలిసీ తెలియని వయస్సులో వారు తొందరపాటుకు, ఉద్వేగానికి లోనై తీసుకున్న నిర్ణయం.. ఓ అభం శుభం తెలియని బాలుడి భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది. ఇకటి కాదు రెండు కాదు ఏకంగా నెల రోజుల పాటు తమ జూనియర్ విద్యార్థిపై ఆరుగురు తొమ్మిదవ తరగతి విద్యార్థినులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నీలి చిత్రాలను చూస్తూ.. వాటిని అనుకరించేట్లు తమకు అనుభవం కావాలంటూ జూనియర్ విద్యార్థిపై అకృత్యానికి పాల్పడ్డారు.
తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జిల్లాలోని ములుగు గురుకులంలోకి రెండు సెల్ఫోన్లను 9వ తరగతి విద్యార్థినులు ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలియకుండా తీసుకోచ్చారు. ఫోన్ల ద్వారానే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఇంటర్నెట్ను ఉపయోగిస్తూ నీలిచిత్రాల వెబ్సైట్లను ఓపెన్చేసిన రోజూ చూసేవారు. ఆ దృశ్యాలు వారిని ఉద్వేగానికి గురిచేశాయి. అలాంటి అనుభవం పోందాలని కోరికలు పుట్టాయి.
దీంతో వేలేరు గురుకులంనుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన 6వ తరగతి విద్యార్థిని వారు టార్గెట్ చేసి పిలిచారు. తమ లైంగిక కోర్కెలు తీర్చాల్సిందిగా వేధింపులకు గురిచేశారు. మొదట్లో కాదని, కుదరదని చెప్పిన విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. దాంతో వారికి లోంగిన విద్యార్థిపై క్రమంగా గదిలోని అరుగురు విద్యార్థినులు అత్చాచారానికి పాల్పడ్డారు. నీలిచిత్రాల్లో ఉన్న విధంగా ప్రవర్తిస్తూ సుమారు నెలరోజులపాటు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
చురుగ్గా కనిపించే బాధిత బాలుడు ముభావంగా ఉండటాన్ని గమనించిన హౌస్మాస్టర్ అక్టోబర్ 28న విచారించగా.. బాధితుడు తనపై జరిగిన అకృత్యాన్ని ఆయనకు వివరించాడు. దీంతో విషయాన్ని గురుకులం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాడు హౌజ్ వార్డెన్. ఆ సమయంలో పరీక్షలు జరుగుతుండగా మిగతా విద్యార్థులపై ప్రభావం చూపుతుందని భావించిన ప్రిన్సిపాల్ సూర్యనారాయణ స్వామి పరీక్షలయ్యేంత వరకు వేచివుండి ఆ తరువాత సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు.
బాలునిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరుగురు విద్యార్థులను విచారించిన ప్రిన్సిపాల్.. వారు తప్పును ఒప్పుకోవడంతో తల్లిదండ్రులను పిలిపించారు. వారి సమ్మతం మేరకు వారికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా ఈ ఘటనను తాను అవమానంగా భావిస్తున్నానని బాధిత విద్యార్థి తెలిపాడు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. తానే వారిపై అత్యాచారం చేసినట్లు చెబుతామని సీనియర్ విద్యార్థినులు హెచ్చరించడంతో ఏం చేయాలో తేచని స్థితి ఏర్పడిందని తెలిపాడు. బాధిత విద్యార్థిని కూడా తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more