4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసిన రిలయన్స్ జియోకు.. సోదర సంస్థ నుంచే పోటీ ఎదురైంది. ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కునుకును కరువు చేసిన రిలయన్స్ జియో లేటుగా వచ్చినా.. లేటెస్టుగా వస్తామన్నట్లు లేటుగా మార్కెట్లోకి వచ్చినా.. టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో పెను సంచలనాలకు కారణమైంది. డిసెంబర్ మాసంలో అత్యంత చౌవకైన 4జీ ఫోన్లను కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో పోటీదారులు జియోను అడ్డకునేందుకు వేస్తున్న ప్రణాళికలన్నీ చిత్తవుతున్నాయి.
ఈ తరుణంలో తన సోదరుడికి చెందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ అర్ కామ్ నుంచి రిలయన్స్ జియోకు భారీగా చెక్ పడనుంది. దీనికి కారణం రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రకటించిన బ్రహ్మాండమైన బంఫర్ ఆఫర్. ఆర్ కామ్ ప్రకటించిన బంఫర్ అఫర్ లో అత్యంత చౌక ధరకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 149 రూపాయల రీచార్జ్ తో కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ ను వినియోగించుకునే వెసులుబాటు ఈ ప్లాన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే ఈ ప్లాన్ ప్రకారం కేవలం రిలయన్స్ టు రిలయన్స్ ఫోన్లు మాత్రమే కాకుండా.. రిలయన్స్ నుంచి ఏ మోబైల్ ఫోన్ కైనా కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదండీ ఈ ఆఫర్ కింద లోకల్ తోబాటు ఎస్టీడీ పోన్లను కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తాజా ప్లాన్లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్వర్క్కు అయినా అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
దేశంలోని అధిక సంఖ్యలో వున్న 2జీ, 3జీ యూజర్లను తమ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈ ప్లాన్ను ఆవిష్కరించింది. ఇక మరోవైపు ఈ అపరిమిత ప్లాన్ వినియోగదారులకు మరో బంపర్ అఫర్ కూడా ప్రకటించింది ఆర్ కామ్. అదేంటంటే..ఈ ప్లాన్ లో చేరిన వినియోగదారులకు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్సెట్స్కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more