యావత్ ప్రపంచం ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తొలి ఫలితం అప్పడే వెల్డైంది. గత ఎన్నో ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆనవాయితీగా తొలి ఓటును వేస్తున్న న్యూ హ్యాంప్ షైర్ లోని డిగ్జ్ విల్లే నాచ్ వాసులు వినియోగించుకోగా, అప్పడే అక్కడికక్కడే ఫలితం కూడా వెల్లడైంది. అమెరికాకు తొలి మహాళా అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డెమోక్రాటికన్ హిల్లరీ క్లింటన్ ఇక్కడి నుంచి తొలి విజయాన్ని అందుకుంది. హిల్లరీ 4-2 ఓట్ల తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించారు.
కెనడా సరిహద్దుల్లో వున్న ఈ గ్రామం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముందుగా ఓటు వేస్తుంది. వంద ఓటర్లకు తక్కువగా వున్న గ్రామాలకు ఈ సదుపాయాన్ని అక్కడి అధికారులు ఎప్పటి నుంచో కల్పించారు. దీంతో ఈ సారి కూడా 8వ తేదీ ప్రవేశించగానే అర్ధరాత్రి 12:01కి పోలింగ్ ప్రారంభం కాగా, ఊళ్లోని ఓటర్లంతా వెంటనే ఓట్లు వేయడం, అందరూ ఓటేయగానే వాటిని లెక్కించడం పూర్తయింది.
డిక్స్ విల్లే నాచ్ గ్రామంలో వాస్తవానికి మొత్తంగా 8 మంది రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే ఉన్నారు. అందులో నలుగురు హిల్లరీకి ఓటు వేశారు. ఇద్దరు ట్రంప్ కు, మరో ఇద్దరు ఓటర్లు మిట్ రొమ్నీ, గ్యారీ జాన్సన్ లకు చెరో ఓటు వేశారు. దీంతో తన సమీప ప్రత్యర్థి ట్రంప్ కన్నా రెండు ఓట్ల మెజారిటీతో హిల్లరీ విజయం సాధించినట్లయింది. ఇదిలా వుండగా, అమెరికాలోని అధిక రాష్ట్రాలలో భారత కాలమాన ప్రకారం ఇవాళ సాయంత్రం ఐదు గంటల తరువాత ఎన్నికలు ప్రారంభం అవుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more