జనసేన అధినేత.. సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. జనం తన బలం అని విశ్వసించిన ఆయన ప్రజలక కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు ఇప్పడు సంచలనాన్ని రేపుతున్నాయి. ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ కల్యాన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది తమకు పవన్ ఇచ్చిన దీవపాళి కానుక అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తుండగా, మరికోందరు మాత్రం ఆయన నిర్ణయాన్ని స్వాగతించలేకపోతున్నారు. ఇంతకీ పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటంటారా..?
గత రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించిన సమయంలో తాను ఓట్ల కోసమే నోట్ల కోసమే పార్టీని స్థాపించలేదని, కేవలం తన పార్టీ ప్రజల సంక్షేమం కోసమేనని, పార్ట్ టైంగా మాత్రమే జనసేన అధినేతగా వుంటానని చెప్పిన ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాన్ ఓటు హక్కే ఈ చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఓటును.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నమోదు చేసుకునేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరికి చెందిన జనసేన పార్టీ నేతలు.. ఆయనను కలిసి.. తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవాలని విన్నవించడంతో దానిపై సానుకూలంగా స్పందించిన పవన్ తనకు అనువుగా ఉండేలా ఒక ఇంటిని కూడా చూడాలని ఆయన కోరారని సమాచారం. దీంతో ఆయన.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ అధికారపక్షం బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో తన ఓటును పవన్ నమోదు చేయించుకోవటం ద్వారా..భవిష్యత్ లో ఆయన చేయనున్న ‘రాజకీయం’ ఎంత సీరియస్ గా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం.. ఇటు కాపు సంఘాల నేతల ఉద్యమం.. వీటితో పాటు తన అభిమానులు, జనసేన కార్యకర్తలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయంగా వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more