కాకినాడ లో సీమాంద్రుల ఆత్మగౌరవం పేరిట జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కొద్ది సేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేనాని అన్నీ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. అయితే పవన్ ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని, ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్ల పసిపాప అని ఆయన చెప్పారు. పవన్ ఏం మాట్లాడినా మన ఇబ్బందులు మనకుంటాయని నేతలతో ప్రస్తావించిన బాబు, పవన్పై, ఆయన ప్రసంగంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది తానేనని ఆయన అన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి అనేక అంశాల్లో వెసులుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు.
రెండు రోజులుగా ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సభాపతిపై వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును ఆయన ఖండించారు. హద్దులు దాటి గందరగోళం సృష్టించారని అన్నారు. వైసీపీ అధినేతది ఉన్మాద చర్య అని ఆయన పేర్కొన్నారు. జగన్ నాయకత్వం వల్లే వైసీపీ సభ్యులు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. హోదా కోసం ప్రతిపక్షాలు రేపు రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చిన అంశంపై చంద్రబాబు స్పందిస్తూ.. బంద్ నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని మరింత ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బంద్కు ప్రజలు సహకరించొద్దని కోరారు.
సభలో తొక్కిసలాట ఒకరి మృతి...
సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అనంతరం పేరిట సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో విషాదం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం చేసి వెళ్లిన అనంతరం అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా అభిమానులు రావడంతో సభ అనంతరం అభిమానులు ఒక్కసారిగా కదలడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు పవన్ అభిమానులకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉండగా, మరొకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్ గా గుర్తించారు. అతడు ద్రాక్షారామం మండలం కుయ్యేరుకు చెందిన యువకుడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న మరో యువకుడిది వై.రామవరం గ్రామంగా గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more