నలుగురిలో బతుకుతున్నామనే భ్రమే తప్ప, సాటివారికి సాయం చేయలేని మనుషులు ఉన్న సంఘం మనది. కొందరు ప్రజా సేవకుల ఈ విషయంలో ఓ ఆకు ఎక్కువే చదివారు. విపత్కర పరిస్థితుల్లో వారు స్పందించే తీరు ఎంత దారుణంగా ఉంటున్నాయో, వాటికి నిర్లక్ష్యం తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ మధ్య వరుస ఉదంతాలు తెలుపుతున్నాయి. ఒడిషాలో మొన్న ఒక భర్త తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని కాలినడకన వెళ్లిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఇప్పుడు సరైన వైద్యం అందించకపోవటమే కాదు, నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఏకంగా ఓ పసిప్రాణం నేలరాలింది.
యాపీ లోని కాన్పూర్ లోని లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి సునీల్ కుమార్ అనే వ్యక్,తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు అంశ్ (12) ను తీసుకొచ్చాడు. స్థానిక ఆసుపత్రిలో చూపించగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారని, ఎమర్జెన్సీలో చేర్చి చికిత్స అందించాలని ఆయన లాలా లజపతిరాయ్ ఆసుపత్రి వైద్యులను కోరాడు. వైద్యులు కనీసం తనను పట్టించుకోలేదని, అక్కడి నుంచి పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పడానికి వారికి అరగంట పట్టిందని ఆయన ఆరోపించాడు. అక్కడి నుంచి పిల్లల ఆసుపత్రి దూరం కావడంతో పిల్లాడిని పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తామని స్ట్రెచర్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, దీంతో తన కుమారుడిని భుజంపై అక్కడికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యంలో మృతిచెందాడని, దీంతో ఆ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి వెళ్లానని ఆయన రోదిస్తూ చెబుతున్నాడు.
రాజస్థాన్ లో కేర్లి గ్రామంలో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించేందుకు ఆంబులెన్స్ లేకపోవటంతో ఓ వివాహిత చనిపోగా, ఒడిషాలో రైలు కింద పడిపోయి రెండు ముక్కలయిన మహిళ శవాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించగా, వెదురు బొంగులకు కట్టి ఇద్దరు కూలీలతో మోయించిన రైల్వే పోలీసులు ట్రెయిన్ లో వేరే ఊరి ఆస్పత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం చేయించారు. ఆస్పత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు లేకపోవటం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపెడుతోంది. ఈ శోకాలు ప్రభుత్వాలకు వినిపిస్తున్నాయో లేదో మరీ? .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more