ఓవైపు కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవం... మరోవైపు ఒలింపిక్స్లో రజత విజేత సింధుకు సత్కార మహోత్సవం! ఈ రెండు కీలక ఘట్టాలకు ఇవాళ విజయవాడ వేదికక కానుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వాగత సత్కారాలు అందుకున్న రజత పతక విజేతను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. తెలుగు తేజం సింధును రాష్ట్ర అతిథి హోదాతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు.
బెజవాడ నగరంలో సిందూ అమె కోచ్ పుల్లెల గోపించంద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అందుబాటులో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తోడు రాగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. రెండు చోట్ల సన్మానాలు, బహుమతుల ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, పవిత్ర సంగమం వద్ద జరిగే కృష్ణా హారతి వేదికపై సింధును సన్మానిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. దీనికి సంబంధించి అధికారులు, మంత్రులకు సీఎం సూచనలు ఇప్పటికే తగిన సూచనలు చేశారు.
సింధును ఎంపీ కేశినేని నాని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తోడ్కొని వస్తారు. మరికోద్ది సేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సింధు చేరుకుంది. క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, క్రీడాభిమానులు సింధుకు గన్నవరం విమానాశ్రయంలో అమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. రెండు కిలోమీటర్ల పోడువైన జాతీయ పతాకంతో అమెకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు భారీగా చిన్నారులు వేచిచూస్తున్నారు. అక్కడి నుంచి బెజవాడ స్టేడియానికి వెళ్లి అక్కడ సింధూతో పాటు అమె కోచ్ గోపిచంద్ ను సన్మానించారు. అ తరువాత దుర్గమ్మ ఘాట్ వద్ద సింధూ కృష్ణా పుష్కరస్నానం అచరించనుంది. సాయంత్రం కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాలలో భాగంగా హరతి కార్యక్రమాలలో కూడా సింధూ పాల్గోననున్నారు. అక్కడ కూడా అమెను ప్రభుత్వం మరోమారు సన్మానించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more