పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా నాశనం చేస్తున్నాడని, ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు తనపై అసత్య ప్రచారాలతో బురదజల్లుతున్నారని అంటున్నాడు ప్రతిపక్ష నేత జగన్. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం నిర్వాసితులు వైఎస్సార్సీపీ నేత సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... పోలవరం కు తాను అడ్డుతగులుతున్నానన్న టీడీపీ నేతల వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఈ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని, ఇటువంటి ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించరని పేర్కొన్నారు. పోలవరాన్ని తనకు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమిషన్లు గుంజారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిధుల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేకుండా ప్రతిపక్షం పై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పట్టిసీమ’ నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ‘పోలవరం’ నిర్వాసితులకూ పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనలో ప్రతిదానికి టెంపరరీ పేరిట అడ్డగొలుగా ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. అస్తమానం సెక్రటేరియట్, ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలు అంటూ కోట్లు తగలేశారని విమర్శించారు. హైదరాబాద్ లో, విజయవాడలో చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల మరమ్మతులకు కోసం ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలవరం పై త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితోసహా సంబంధిత మంత్రికి వినతి పత్రం సమర్పిస్తామని ప్రకటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more