పోలవరాన్ని బాబు ఎలా నాశనం చేస్తున్నాడంటే... | Jagan fire on chandrababu at Polavaram Expats meet

Jagan fire on chandrababu at polavaram expats meet

Jagan on Polavaram, YSRCP not against with Polavaram, Polavaram TDP, Polavaram Expats

Jagan fire on chandrababu at Polavaram Expats meet west godavari.

ITEMVIDEOS:పోలవరాన్ని చంద్రబాబు ఎలా నాశనం చేస్తున్నాడంటే...

Posted: 07/13/2016 05:23 PM IST
Jagan fire on chandrababu at polavaram expats meet

పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా నాశనం చేస్తున్నాడని, ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు తనపై అసత్య ప్రచారాలతో బురదజల్లుతున్నారని అంటున్నాడు ప్రతిపక్ష నేత జగన్. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం నిర్వాసితులు వైఎస్సార్సీపీ నేత సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... పోలవరం కు తాను అడ్డుతగులుతున్నానన్న టీడీపీ నేతల వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివన్నారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఈ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని, ఇటువంటి ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించరని పేర్కొన్నారు. పోలవరాన్ని తనకు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమిషన్లు గుంజారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిధుల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేకుండా ప్రతిపక్షం పై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పట్టిసీమ’ నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ‘పోలవరం’ నిర్వాసితులకూ పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.

చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనలో ప్రతిదానికి టెంపరరీ పేరిట అడ్డగొలుగా ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. అస్తమానం సెక్రటేరియట్, ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలు అంటూ కోట్లు తగలేశారని విమర్శించారు. హైదరాబాద్ లో, విజయవాడలో చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల మరమ్మతులకు కోసం ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలవరం పై త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానితోసహా సంబంధిత మంత్రికి వినతి పత్రం సమర్పిస్తామని ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  YS Jagan  Polavaram  Expats  West Godavari  

Other Articles