చరిత్రకు పట్టిన చెదలు దులిపేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సిద్థమైపోతుంది. ప్రస్తుతం అధికారంకు ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ సరైన మీడియా అండ లేకపోవటంతో సొంత పుత్రికను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం మూతపడిపోయిన ‘నేషనల్ హెరల్డ్’ దినపత్రికను తిరిగి ప్రారంభించేందకు రంగం సిద్ధం చేసింది.
ఈ పత్రికతోపాటే ఖువామీ ఆజాద్(ఉర్దూ), నవజీవన్(హిందీ) దినపత్రికలను కూడా తిరిగి ప్రారంభించబోతుంది. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పేపర్లను పబ్లిష్ చేసే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సీఎండీ మోతీలాల్ వోరా ఈ విషయమై ప్రకటన చేశారు. జనవరిలోనే జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆయా పత్రికలకు కూడా ఎడిటర్ల పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే దినపత్రికలా కాకుండా ముందుగా ఆన్ లైన్ ఎడిషన్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈ రెండు మూడు రోజుల్లో ఓ అధికారిక ప్రకటన చేయనున్నారంట.
ఇక 1938లో లక్నోలో జవహర్లాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించారు. ఆ తర్వాత మరోమారు 1940, 70లలో మూతపడింది. అనంతరం తెరుచుకున్నా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడింది. చివరికి పూర్తిగా సంక్షోభంలో చిక్కుకోవడంతో 2008లో మూతపడింది. ఆ సమయంలో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చలేమని ఇందుకు కంపెనీకి చెందిన 9 కోట్ల పై చిలుకు షేర్లను వైఐఎల్కు ఇచ్చేందుకు ఏజేఎల్ సర్వసభ్యసమావేశం తీర్మానించింది. దీంతో రూ.50 లక్షలకే దాదాపు రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులు నలుగురైదుగురి నియంత్రణలోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సోనియా, రాహుల్ తోసహా ఆరుగిరిపై ఢిల్లీ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more