కేంద్ర కేబినెట్ విస్తరణ ముగిసింది. రాష్ట్రపతి భవన్ లోని దర్భార్ హాల్ అతికొద్ది నేతల సమక్షంలో సింపుల్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ అధ్యక్షడు అమిత్ షా, కేంద్ర
మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, మేనకా గాంధీ, నితిన్ గడ్కరీ, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా జాతీయ గీతాలాపన తర్వాత ప్రారంభమైన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక్కోక్కరిచే ప్రమాణం చేయించారు.
ఊహించినట్లుగానే అంతా కొత్త ముఖాలతోనే నింపేశారు. ముందుగా ప్రకావ్ జవదేవకర్ కు కేబినెట్ హోదా కల్పించగా, ఆపై ఒక్కోక్కరితో ప్రణబ్ ప్రమాణం చేయించారు. ఆరుగురికి ఉద్వాసన పలికి మొత్తం 19 మంది కేంద్ర సహాయ మంత్రులను తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు ప్రధాని మోదీ. ఇందులో ఇద్దరు మహిళలు బెర్తులు దక్కించుకున్నారు. రాంశంకర్ కటారియా, మోహన్ భాయ్ కుందారియా, నిహాల్ చంద్, మన్ షఉక్ భాయ్ వాసవ, సనవర్ లాల్ జాట్, సిద్ధేశ్వరలు మంత్రివర్గం నుంచి ఔట్ అయ్యారు. ఇక ఈ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించారు.
కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే...
ఫగ్గస్ సింగ్ కులస్తే (మాండ్లా) మధ్యప్రదేశ్
ఎస్ఎస్ అహ్లూవాలియా (డార్జీలింగ్) పశ్చిమ బెంగాల్,
రమేష్ చందప్ప జిగజినాగి (బీజాపూర్), కర్ణాటక
విజయ్ గోయల్ (రాజ్యసభ సభ్యుడు), రాజస్థాన్
రామ్ దాస్ అత్వాలే (రాజ్యసభ సభ్యుడు), మహారాష్ట్ర: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ అయిన ఈయన ప్రమాణ స్వీకారంలో తడబడ్డాడు. ప్రణబ్ ముఖర్జీ 'మే' అనగానే, తన పేరును ఉచ్ఛరించకుండా రామ్ దాస్ ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. తప్పును గమనించిన ప్రణబ్, పేరును చదవాలని సూచించారు. ఆపై కూడా అత్వాలే పలుమార్లు ఇబ్బందులు
పడుతుంటే, ప్రణబ్ కలగజేసుకుని స్వయంగా ముందుండి చదువుతూ, ఆయనతో ప్రమాణం పూర్తి చేయించారు.
అనిల్ మాధవ్ దవే (రాజ్యసభ సభ్యుడు), మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం
పురుషోత్తమ్ గోడాభాయ్ రూపాలా (రాజ్యసభ సభ్యుడు), గుజరాత్
ఎంజే అక్బర్ (రాజ్యసభ సభ్యుడు), జార్ఖండ్
అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనీర్), రాజస్థాన్
జస్వంత్ సిన్హ్ భాభోర్ (దాహోద్), గుజరాత్
డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే (చందౌలీ), ఉత్తర ప్రదేశ్
అజయ్ టంటా (అల్మోరా), ఉత్తరాఖండ్
కృష్ణారాజ్ (షాజహాన్ పూర్), ఉత్తరప్రదేశ్
మన్సుఖ్ భాయ్ మందావియా (రాజ్యసభ సభ్యుడు), గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం
అనుప్రియా సింగ్ పటేల్ (మీర్జాపూర్), ఉత్తరప్రదేశ్
సీఆర్ చౌదరి (నాగౌర్), రాజస్థాన్
పీపీ చౌదరి (పాలీ), రాజస్థాన్
శుభాష్ రామ్ రావ్ భామ్రే (ధూలే) మహారాష్ట్ర లు ప్రమాణం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more