ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19) ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కుందో ఆఖరి ఘడియల్లో తన తండ్రికి వివరించింది. తన ఇద్దరు స్నేహితులతో పాటు రెస్టారెంటులోని వాష్ రూమ్ లో దాక్కున్న ఆమె తండ్రికి ఫోన్ చేసి ఉగ్రవాదులు ఇక్కడ రెస్టారెంటులోకి చొరబడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రాణాలతో భయటకు వస్తానో లేదో కచ్చితంగా మాత్రం చెప్పలేను. ఇక్కడ అందరినీ వాళ్లు చంపేస్తున్నారు. నేను నా స్నేహితులతో కలిసి టాయిలెట్ లో దాచుకున్నాను. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం హత్యకు గురవుతామనిపిస్తుంది' అని ఆమె తండ్రి సంజీవ్ జైన్ మీడియాతో చెప్పారు.
అదే ఆమె నుంచి చివరి మాటలని వివరించాడు. తన కూతురు నుంచి ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తెల్లవార్లు గుర్షాన్ కేఫ్ వద్ద ఎంతో కంగారుగా ఎదురుచూశాడు. తెల్లవారు జామున ఆమె ఫోన్ డెడ్ అయినా బలగాలు సైనిక చర్యలు జరుపుతున్నారని, బంధీలకు విముక్తి లభిస్తుందని చెప్తుండగా ఆశగా ఎదురుచూశాడు. 13మంది బందీలకు విముక్తి అని చెప్పాక అందులో తమ కూతురు ఉండకపోతుందా అని భావించాడు. కానీ ఉగ్రవాదులు కర్కశంగా గొంతు కోసిన 20మందిలో తమ కూతురు కూడా ఉందని తెలిసి నిశ్ఛేష్టుడయ్యాడు. కాగా, తమ సోదరిని ఒక హిందువుగా భావించి దారుణంగా చేసిన ఆ ప్రాంతంలో మేం అంత్యక్రియలు నిర్వహించబోమని, ఇండియాకు తీసుకొచ్చుకుంటామని ఆమె సోదరుడు చెప్పాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more