తెలంగాణ శాసససభ కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి మరోమారు తన మనసులో మాటను బాహాటంగా బయటపెట్టారు. ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలన్న తన రాజకీయ ఆకాంక్ష అనే అంశాన్ని మరోమారు చెప్పకనే చెప్పారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పక్షంలో ముఖ్యమంత్రి పదవికి తానే అర్హుడనని, తన కన్నా సీనియర్ పార్టీలో లేరని.. దీంతో రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి తనను వరిస్తుందని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. నాగార్జున సాగర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎవరు వెళ్లిపోయినా.. పార్టీకి నష్టం లేదన్నారు. అయితే తానున్న స్థాయిలో ఎవరినీ దూషించలేనని, పార్టీలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో తనను సీఎం పదవి వరించినా వదులుకున్నానని ప్రకటించిన ఆయన.. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సమానమైన మనిషినని చెప్పుకోచ్చారు, స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. అలా జరిగితే తెలంగాణకు తాను ముఖ్యమంత్రి అయినట్లేనని జనా వ్యాఖ్యనించారు.
జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో పెద్ద కలకలాన్నే లేపింది. గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్లో ఉపాధ్యాయులు ఘెరావ్ చేసిన సందర్భంగా కూడా జానా ఈ విధమైన వ్యాఖ్యలే చేశారు. ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తెలంగాణ వస్తే సీఎంను అయ్యేది తానేనని చెప్పారు. మళ్లీ ఇప్పుడు జానా సీఎం పదవి గురించి వ్యాఖ్యానించడం అటు జిల్లాలో, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే జానా వ్యాఖ్యలపై గాంధీభవన్ సహా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more