తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు భారీగా గండి పడనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, నల్గోండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కడం దాదాపు ఖరారయ్యింది. ఈ మేరకు గురువారం ఆయన, మరికొందరు నేతలతో కలిసి ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ కలిసోచ్చినట్లు సమాచారం. ఆయన కూడా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, దివంగత ఎంపీ వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతావారి చేరికపై సంగ్ధిగ్ధం నెలకొన్నప్పటికీ గుత్తా చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరికిందని చెబుతున్నారు.
కాగా, అధికార పార్టీ చేపట్టిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన గులాబీ బాస్ ఇప్పటికే టీటీడీపీని ఖాళీ చేసేశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి ప్రమాదం ఉండకుండా, తెలంగాణలో తమకు ఎదురే లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. నెలరోజులుగా కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్న గుత్తా ఎట్టకేలకు టీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మిగతా వారి చేరిక ప్రతిపాదనను ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి వివేక్, వినోద్ లు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. కానీ, సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు వారు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. తర్వాత వరంగల్ లోక్ సభ ఎన్నిక సందర్భంగా వివేక్ మళ్లీ టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ ను వీడేది లేదని ఆ సమయంలో ఆయన ప్రకటించుకున్నారు.
అయితే అంతర్గత కుమ్ములాటతో పార్టీ పతనమవుతున్న తరుణంలో ఇంకా కాంగ్రెస్ కొనసాగటం మంచిది కాదని వెంకటస్వామి తనయులు భావిస్తున్నారంట. మరోనేత కేఆర్ సురేష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో స్పీకర్ గా పనిచేశారు. వైఎస్ అనంతరం రాజకీయాల నుంచి దూరమైన ఆయన తిరిగి యాక్టివ్ అవుదామని భావిస్తున్నాడంట. దీంతో వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే గుత్తాతోపాటుగానే వీరు చేరతారా లేక గ్యాప్ ఇచ్చి మారతారా అన్నదానిపై స్పష్టత లేదు. ఓ వారం అటు ఇటు అయినా వీరు పార్టీ మాత్రం ఖాయమని తెలుస్తోంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more