దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నెల రోజుల ముందు రిజర్వేషన్ చేసుకున్నా బెర్త్ లభించలేని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషం దాకా ఊరించే వెయిటింగ్ లిస్ట్ పై ఊసురుమంటూ ఆశలు పెట్టుకుని వెయిట్ చేయాల్సిందే. కానీ, ఇకపై అలాంటి ఎదురు చూపులు అక్కర్లేదు. వెయిటింగ్ లిస్ట్ లోని ప్రయాణికులకు ఊరట కలిగించేలా రైల్వే శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. తత్కాల్ టికెట్ కాన్సిల్ చేసుకున్నా సరే 50శాతం నగదును వాపసు చేసేలా ఏర్పాటు చేసింది.
ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా వేరే రైలులో ప్రయాణించే వెసులు బాటును కల్పించింది. ఇందుకోసం వికల్ప్ పథకానికి కొన్ని మార్పులు చేసింది. రాజధాని ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూర్, సికింద్రాబాద్ మార్గాల్లో ప్రయాణించే వారు వారి వారి ఇష్టం మేరకు వేరే ట్రెయిన్ లలో కూడా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్లోచ్చు. అయితే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లకు ఇది వర్తించదు. అలాగే రిజర్వేషన్ బుకింగ్ వేళలో కూడా మార్పులు చేశారు. ఏసీ బుకింగ్ ఉదయం 10 నుంచి 11 వరకు, స్లీపర్ కోచ్ బుకింగ్ ఉదయం 11 నుంచి 12 వరకు మార్చారు. ప్రాంతీయ భాషల్లో కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. మారిన ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంతేకాదు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్లాట్ ఫాం, ఆన్ రిజర్వ్, సీజన్ టికెట్లు కౌంటర్ కి వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేయొచ్చు. ప్రయోగాత్మకంగా నిజాముద్దీన్ స్టేషన్లో ఈ ప్రాజెక్టును అల్రెడీ ప్రారంభించారు కూడా.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more