వెండి తెర రారాజులా వెలిగిపోతున్న హీరో మహేశ్ బాబు.. శ్రీమంతుడు తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం నిరాశ కల్పించినా.. మాట తప్పడం. మడమ తిప్పడం తన ఇంటా వంటా లేదని అంటున్నాడు. ఇటీవల ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల తన దత్తత గ్రామాం బుర్రిపాలేనికి వెళ్లి అక్కడి గ్రామస్థులు అభిమానులతో కలసి సందడి చేసి.. గ్రామాభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన ప్రిన్స్.. అదే రోజున తెలంగాణలోని తన దత్తత గ్రామాన్నికి కూడా త్వరలోనే వెళ్తానని ప్రకటించారు.
అన్న మాట మేరకు ఆయన సతీమణి భార్య నమ్రత శిరోద్కర్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ అభివృద్ధిపై ఆమె మంత్రిలో భేటీ అయ్యారు. మహేశ్ బాబు సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో గ్రామాభివృద్ది విషయమై అమె మంత్రితో చర్చించారు. సిద్దాపూర్ అభివృద్ధికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యం, పరిశుభ్రత, స్కూల్ అభివృద్ధిపై నమత్ర ఆసక్తి చూపినట్లు చెప్పారు.
మరోవైపు మంత్రితో భేటీ అనంతరం నమ్రత మాట్లాడుతూ సిద్దాపూర్ను స్మార్ట్ విలేజ్గా మార్చుతామని తెలిపారు. సిద్దాపూర్ గ్రామ అభివృద్ద్ధికి సమగ్ర ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆమె సిద్దాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ నర్సమ్మ నమత్ర శిరోద్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై నమ్రతకు ఓ వినతిపత్రం సమర్పించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more