కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అక్షింతలు పడడం పరిపాటిగా మారింది. అత్యున్నత న్యాయస్థానం తమపై మండిపడుతన్నా.. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం విఫలం అవుతుంది. దేశ వ్యాప్తంగా అలుముకుని వున్న కరుపు పరిస్థితులను పరిష్కరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సమంజసంగా లేవని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్రంపై మండిపడిన విషయం తెలిసిందే.
అ విషయం మరువక ముందే కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధిహామీ కింద పనిచేసిన రైతులకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవటంపై సుప్రీం కోర్టు కేంద్రానికి అక్షింతలు వేసింది. ఈ పథకం కింద ఇవాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడింది. నిధులతో పాటు ఆలస్యానికి రోజుకు 0.05 శాతం చొప్పున పరిహారం అందించాలని జస్టిస్ ఎంబీ లోకుర్, ఎన్వీ రమణల ధర్మాసనం ఆదేశించింది.
నిధుల కొరత ఉందనే కారణంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోలేదని సుతిమెత్తగా హెచ్చరించింది. జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్ఎఫ్ఎస్ఏ)ప్రభావవంతంగా అమలు చేసేందుకు కమిషనర్లను నియమించుకోవాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ట పరుచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు ఉపాధి హామీ చట్టంలో పేర్కొన్నట్లుగా కేంద్రీయ ఉద్యోగ ఉపాధి కౌన్సిల్ను ఏర్పాటుచేసుకుని కరువు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని అదేశించింది.
ఇక దాంతో పాటుగా, కరువు పీడత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతన్న ప్రదేశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవంతా కొనసాగించాలని ఆదేశించింది. అయితే తన ఆదేశాల అమలుకు కోర్టు కమిషనర్ల నియామకానికి విముఖత తెలిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 1న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కరువుప్రాంతాల్లో ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవతీసుకోవాలని సూచించింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more