భారతదేశం పటంలొ కొన్ని సార్లు జమ్ము కాశ్మీర్ కనిపించదు.. కొన్ని సార్లు ఈశాన్య రాష్ట్రాలు కనిపించవు. మరి మన భూభాలు ఎక్కడి దాకా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనే దాని మీద ఇక నుండి క్లారిటీ ఉంటుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించడమో, ప్రచురించడమో చేస్తే జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదు! ఈమేరకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల వరకు భారీ జరిమానా విధించేందుకు ‘ది జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్లు-2016’ డ్రాప్ట్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో, అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో భాగంగా ఉన్నట్లుగా పటాలు ప్రదర్శితమవుతుండటంతో వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ కఠిన చర్యకు ఉపక్రమించింది.
‘‘ఇంటర్నెంట్ వేదికలు, ఆన్లైన్ సర్వీసులతోపాటు మరెక్కడైనాగానీ ఎవరైనా భారత భౌగోళిక పటానికి సంబంధించి అంతర్జాతీయ సరిహద్దులు సహా తప్పుడు, అబద్ధాలతో కూడిన అంశాలను చిత్రీకరించినా, ప్రదర్శించినా, ప్రచురించినా, పంపిణీ చేసినట్లు కనుగొన్నా.. చట్టప్రకారం రూ. కోటి నుంచి రూ100 కోట్ల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్షకు గురౌతారు’’ అని డ్రాప్ట్లో పొందుపరిచారు. సాక్షాత్తు ట్విటర్ సైట్ ఇటీవల కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రహితంగా భారత భౌగోళిక పటాన్ని ప్రదర్శించింది. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేయడంతో సరిచేసింది. మొత్తానికి చాలా కాలానికి అందరిని భయపెట్టేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో భారతదేశ పటాన్ని ఖచ్చితంగా కేంద్రం సూచించినట్లే ఉండాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more