కేంద్రమంత్రి సుజనా చౌదరికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చెక్కెదరైంది. సుజనా చౌదరి వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. తనను వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ సుజనా హైకోర్టును ఆశ్రయించారు. తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని వారెంట్లు జారీ చేసిన నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు అదేశాలను సవాల్ చేస్తూ ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు,
సుజనా చౌదరి వేసిన పిటీషన్ విచారించిన హైకోర్టు ఆయన వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 26న నాంపల్లి కోర్టుకు సుజనా చౌదరి హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ పై హైకోర్టు సడలింపు ఇస్తూ ...మే 5న ఆయన వ్యక్తిగతంగా కోర్టు హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. కాగా మారిషస్ బ్యాంక్ కు రుణం ఎగవేత కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని, రుణం చెల్లించాలని కోర్టు మూడు సార్లు సమన్లు ఇచ్చినా సుజనా చౌదరి పట్టించుకోకపోవటంతో నాంపల్లి కోర్టు గురువారం సుజనా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more