గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురుచూస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ ను భారతీయ విఫణిలో ఆవిష్కరించింది షియోమీ సంస్థ. చైనా యాపిల్ సంస్థగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ ఇటీవల విడుదలైన యాపిల్ ఐ పోన్ ఎస్ ఈ ని ఢీకొనేందుకు సిద్దంగా వుంది. ఇప్పటి వరకు యాపిల్ సంస్థ నుంచి అత్యంత తక్కువగా చౌకధర ఫోన్ గా విడుదలైన ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలతో షియోమీ పోటీ ఇవ్వనుందని అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ధరలో కూడా ఈ రెండు బ్రాండ్లు రమారమి ఒకేలా వున్నాయి.
షియోమి ఫ్లాగ్ షిప్ పోన్ 24, వేల 999 రూపాయలుగా నిర్థారించారు. బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ తొలిసారిగా ఈ ఫోన్ లు ప్రదర్శించింది. అయితే ఈ ఫోన్ ను చైనాలో 1999 యోవన్ లు అంటే సుమారుగా 21 వేల రూపాయలకు దీనిని నిర్థారించగా, భారత్ సహా పలు దేశాలలో దీని ధర 25 వేలుగా నిర్థార్థించింది. అయితే ఈ ఫోన్ లు ఏప్రిల్ 6 నుంచి అమ్మకాలు సాగించనుంది. నలుపు, సువర్ణం, తెలుపు వర్ణాలలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్ సుమారుగా 129 గ్రాముల బరువుతో 7.25 మిల్లీమీటర్ల మందంతో వుంది.
షియోమీ ఎంఐ 5 స్పెసిఫికేషన్స్
శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ , అలానే 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ప్లే, అయితే క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే తో ఈ ఫోన్ ల్యం కావడం లేదు. 4కె వీడియో రికార్డింగ్ , 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి. ఐ ఫోన్ ఎస్ కంటే తక్కువ బరువుతో కేవలం 129 గ్రా. తూగే ఈ షియామీ ఎమ్ఐ ధర 25000 రూపాయలు ఉంటుదంని అంచాన. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు లాంచింగ్ అనంతరం వెల్లడి కానున్నాయి.
చైనా తరువాత మొదటి మన ఇండియన్ మార్కెట్లలో దీన్ని మూడు వేరియంట్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే మూడు వేరియంట్లను విడుదల చేసింది. 3జిబి రామ్ 32 జిబీ స్టోరేజ్ తో తొలి వేరియంట్ ను విడుదల చేసింది. ఇక రెండో వేరియంట్ 3జిబీ 64 జిబి స్టోరేజ్ తో అందుబాటు తీసుకురాగా, ఇక ఎంఐ 5 ప్రో అనే పేరుతో వచ్చిన మూడో వేరియంట్ 4 జిబి ర్యామ్ తో పాటు 128 జిబీ స్టోరేజ్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా భారతీయ విఫణిలోకి బేసిక్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more