ఒక పార్టీకి చెందిన ఎంపి 'భారత మాతా కి జై' అనమని రాజ్యంగం ఎక్కడ సూచించలేదని పెర్కోన్నాడని (అసదుద్దీన్ ఓవైసి ని ఉద్దేశించి), అది నిజమే రాజ్యంగంలో ఎక్కడ అలా రాసి లేదు కానీ భారత్ మాతా కి జై అనటం నా అధికారం అని రాజ్యసభ సభ్యుడు, రచయిత జావేద్ అక్తర్ ఉద్ఘాటించారు. ఆయన 'భారత మాతా కి జై' అని నినాదాలు చేశారు, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సభ మొత్తం హర్షధ్వానాలతో నిండి పోయింది. రాజ్యసభలో పదవి విరమణ సంధర్భంగా జావేద్ అక్తర్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* 'భారత్ మాతా కి జై' నిబంధన కాదు, అధికారం. అది రాజ్యంగంలో లేకుంటే టోపి పెట్టుకోవడం, సూటు బూటూ వేసుకోవడం కూడా రాజ్యంగంలో లేవు, ఆ పనులు ఎందుకు చేస్తున్నావు( ఒవైసీ పై విమర్శ).
'పాకీస్తాన్ ఛాలే జావ్' ఈ స్లోగన్ ఎక్కువ వినిపిస్తుంది, ఎమ్మెల్యేలు, ఎంపిలు మొదలుకొని కెబినెట్ మంత్రుల వరకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, వారిని అధికార పార్టీ నాయకులు అదుపులో పెట్టాలి.
* భారత్ లో సర్కార్, ప్రతిపక్షం ఉంటుంది, ఉండాలి కూడా. అదే మన ప్రజాస్వామ్య ప్రత్యేకత
* గ్రామాలలో అయినా, ఎక్కడైనా భారత్లోని యువకుల ఐక్యూ చాలా పవర్పుల్ గా ఉంటుంది. దేశాభివృద్ధికి దానిని ఉపయోగించాలి.
* నేను సభలోని అధికార, ప్రతిపక్ష నేతలయిన జైట్లీ, ఆజాద్ ల ప్రసంగాలు విన్నాను.చిదంబరం, కపిల్ సిబల్ లాంటి వారు డిబేట్ చేస్తుంటే విన్నాను.
* బృందాకారత్, సీతారాం ఏచూరి ల లాజికల్, ప్రభావితమైన ప్రసంగాలు నన్ను ప్రభావితం చేశాయి.
* ప్రజాస్వామ్యం అంటే, మెజారిటీ వర్సెస్ మైనారిటీ కాదు, అన్ని వర్గాలను మెజారిటీ అయిన మైనారిటీ అయిన ఆ వర్గాలను గౌరవించడం.
* సెక్యులరిజం అనే విధానం మాత్రమే అన్ని వర్గాలను గౌరవిస్తుంది, దాని ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
* అభివృద్ధి అంటే, జిడిపి కాదు...హ్యుమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్. ప్రతి భారతీయుడి కడుపు నిండటం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more