Two Telugu youths killed in car mishap in perth

Two telugu youths killed in car mishap in perth

car mishap, Perth, Australia, Medavarapu Seshagiri, Bhimavaram, Samala Arvind Kumar, Hyderabad, Hanamkonda couple, Nishant, Priyadarshini, government help

A group of Telugus met with a serious car mishap in Perth in Australia in which two youths were killed and a couple was severely injured.

అస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో అసువులుబాసిన తెలుగు విద్యార్థులు

Posted: 03/10/2016 06:54 PM IST
Two telugu youths killed in car mishap in perth

దేశం కాని దేశానికి విద్యాబాసానికని వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ రోడ్డు ప్రమాదంలో అశువులు బాసారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం నాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో భీమవరానికి చెందిన మేడవరపు శేషగిరి, హైదరాబాద్ కు చెందిన సామల అరవింద్ కుమార్ అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

అదే కారులో ప్రయాణిస్తున్న హన్మకొండకు చెందిన దంపతులు నిశాంత్, ప్రియదర్శిని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ బాధితుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదం సమాచారం అందగానే మృతుల నివాసాల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించి తమకు పేరు తీసుకువస్తాడనుకున్న బిడ్డలను ఇలా మృత్యువు అర్థాంతరంగా తీసుకుపోయిందని బంధువులు శోకసంధ్రంలో మునిగిపోయారు.

అదే ప్రమాదంలో గాయపడిన తమ పిల్లలను చేసేందుకు అస్ట్రేలియా వెళ్ళాలని యత్నిస్తున్న దంపతులు నిశాంత్, ప్రియదర్శిన తల్లిదండ్రులు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు.  తాము అక్కడికి వెళ్లాలంటే ఎవరిని సంప్రదించాలో తమకు తెలియడం లేదని, వీసా కూడా తమకు లేదని ప్రియదర్శిని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తమకు సాయమందించాలని వారు కోరుతున్నారు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : car mishap  Perth  Australia  telugu students  young souple  

Other Articles