వివాదరహిత రాజకీయ నేత, లోక్ సభ మాజీ స్పీకర్, మేఘాలయ తురా నియోజకవర్గ ఎంపీ పీఏ సంగ్మా ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అరవై తొమ్మిదేళ్ల ఆయన ఇవాళ ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1988 నుంచి 1990 వరకూ మేఘాలయ ముఖ్యమంత్రిగా, 1996 నుంచి 1998 వరకూ 11వ లోక్ సభ స్పీకరుగా సేవలందించిన ఆయన, 1947 సెప్టెంబర్ 1న జన్మించారు. 8 సార్లు పార్లమెంటుకు ఎన్నికైయ్యారు. సంగ్మా మరణవార్త తెలియగానే పార్లమెంటు ఉభయ సభలను వాయిదా వేశారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు, నేతలూ సంతాపం తెలిపారు.
సంగ్మా పూర్తిపేరు పూర్ణో అజితోక్ సంగ్మా. 1947, సెప్టెంబర్ 1న మేఘాలయా పశ్చిమ గారో పర్వత ప్రాంతంలోని ఛాపతి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు మరక్ సంగ్మా, చింగ్మీ సంగ్మా. షిల్లాంగ్ లోని ఆంటోనీ కాలేజీలో బీఏ(హానర్స్) పూర్తిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. కాలేజీ చదువుల అనంతరం పూర్తికాలం రాజకీయనేతగా కెరీర్ ప్రారంభించిన సంగ్మా.. 1973లో మేఘాలయ యూత్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తర్వాతి ఏడాది ఆ విభాగానికి జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975-1980 మధ్య కాలంలో మేఘాలయ పీసీసీ సెక్రటరీగా వ్యవహరించారు.
తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 1977లో (6వ లోక్ సభకు) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సంగ్మా ఇప్పటికీ(14వ లోక్ సభ వరకు) ఎంపీగానే కొనసాగుతుండటం విశేషం. 1996 మే 25 నుంచి 1998 మార్చి 23 వరకు (11వ లోక్ సభకు) లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. కేంద్రమంత్రి వర్గంలోనూ పలు శాఖలు నిర్వహించిన సంగ్మా.. 1988 నుంచి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటుపై మళ్లీ కేంద్ర పదవులు చేపట్టారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై 1999లో తిరుగుబావుటా ఎగరేసిన పీఏ సంగ్మా.. శరద్ పవార్, తారీఖ్ అన్వర్ లతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటుచేశారు. అయితే 2011లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవాలనుకున్న ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ సమర్థించకపోవడంతో ఆ పార్టీని వీడి సొంతగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ)ని స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీపై పోటీచేసి ఓటమిపాలయినప్పటికీ గిరిజన నేతగా ఆయన చేసిన రాజకీయపోరాటం చరిత్రలో నిలుస్తుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more