రైల్వే బడ్జెట్ కి టైం దగ్గర పడుతోంది. లక్షా 25వేల కోట్ల రూపాయిల వ్యయంతో 2016-17 రైల్వే బడ్జెట్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఛార్జీల మోత మాత్రం వద్దు సురేష్ ప్రభో అని సామాన్యుల విజ్ఞప్తి పెరుగుతోంది. పరిశుభ్రత, ప్రయాణికులకు భద్రత పెంచండి అంటూ ప్రయాణికులు మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సామాన్య ప్రయణికుల విన్నపాలను కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. ఏం చేయబోతున్నారన్న సస్పెన్స్ కొన్ని గంటల్లోనే ముగియనుంది.
నష్టాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైల్వే లాభాల బాట పట్టాలంటే.. ఈ సారి బడ్జెట్లో ఛార్జీలను పెంచాల్సిందేనని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కోరుతోంది. సరుకు రవాణాకు ప్రాధాన్యత పెంచడానికి బడ్జెట్-లో పెద్దపీట వేయాలని కోరుతున్న అసోచామ్.. ప్రయాణికుల ఛార్జీలు పెంపుతోనే అభివృద్ధి సాధ్యమని సూచిస్తోంది. అయితే లక్కీగా అసోచామ్ సూచనలను పక్కన పెట్టిన సురేష్ ప్రభూ.. 2016-17 రైల్వే బడ్జెట్ ఛార్జీల పెంపు అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే సంకేతాలు ఇస్తున్నారు . కాగా గత బడ్జెట్ లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, రైలును కానీ కేటాయించలేదు.. మరి ఈ బడ్జెట్ కూడా సంస్థాగత నిర్మాణం కోసం ఉద్దేశించిందా లేదంటే జనాకర్షక బడ్జెట్ ఉంటుందా అని ఎదురు చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more