పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. యూనివర్సిటీ ఆవరణలోకి చొరబడిన ఉగ్రవాదలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు కూడా పేల్చారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 70కి పెరిగింది. పఠాన్కోట్ తరహాలోనే దాడికి పాల్పడ్డారు. ఆరుగురు ఉగ్రవాదులను పాక్ సైనికులు హతమార్చారు. మరికొంత మంది వర్సిటీలోనే ఉంటూ దాడులు చేస్తున్నారు.
దాడి సమయంలో యూనివర్సిటీలో 3 వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథిలు ఉన్నారని కాగా, ఉగ్రదాడిలో అనేక మంది చనిపోయారని,. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ప్రాణ నష్టం తగ్గించేందుకు పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది. ముందుగా హాస్టల్స్ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించింది. 20 అంబులెన్స్లను వెంటనే రప్పించారు. దాడి సమయంలో భయపడ్డ విదార్థులు, ప్రొఫెసర్లు పరుగులు తీశారు.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నెలకొన్న బచాఖాన్ యూనివర్సిటీలో కవి సమ్మేళనం జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకున్న ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులలో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని సైతం తమ వెంట తెచ్చుకుని కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా వున్న అఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమానికి నామమాత్రపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీనిని అదునుగా తీసుకున్న తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాదులు 10 మంది అకస్మికంగా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి.. కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం. కాల్పులతో పాటు బాంబులు విసురుతూ యూనివర్సిటీ విద్యార్ధులను, ప్రోఫెసర్లను, అతిధులను భయకంపితులను చేశారు.
కాగా, ఇప్పటి వరకు 31 మృతదేహాలను మార్చురికి తరలించారు. ఇంకా వర్సిటీలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరు వర్సిటీలోని బాయ్స్ హాస్టలో దాక్కుని కాల్పులు జరుపుతున్నట్లుగా తెలియవచ్చింది. ఉగ్రవాదులు విద్యార్థులు, ప్రొఫెసర్లనే టార్గెట్ చేసుకున్నట్లుగా తెలియవచ్చింది. ఉగ్రవాదులు అందరూ 18-25 ఏళ్ల వయస్సులోపు వారేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులందరూ ఆర్మీ దుస్తుల్లో యూనివర్సిటీలోకి ప్రవేశించి దాడులకు పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రీక్ ఇ తాలిబన్ తొలుత ప్రకటించి ఆ తరువాత తాము కాదని పేర్కోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more