గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలలో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీల మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. పలు దఫాలుగా జరిగిన చర్చల్లో సీట్ల సర్ధుబాటుపై పట్టువీడని పార్టీలు నామినేషన్ల పర్వానికి ఒక్క రోజు మాత్రమే మిగిలివుండటంతో.. చిట్టచివరికి గత రాత్రి పొద్దుపోయిన తర్వాత రెండు పార్టీలో ఒక అవగాహనకు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లలోనూ పోటీ చేయాలని ఈ కూటమి తీర్మానించింది. 90 డివిజన్లలో టీడీపీ పోటీ చేయనుండగా, 60 సీట్లలో బీజేపీ తన అభ్యర్థులను నిలపనుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలలో ఆయా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మెజార్టీ డివిజన్ లను ఆ పార్టీ తీసుకోవాలని ప్రతిపాదించారని సమాచారం. ఆ తర్వాత గతసారి ఎవరు గెలిచిన చోట వారు పోటీచేయాలని ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం చెప్పినప్పటికీ.. మొత్తం మీద 90-60 పార్ములాకు అంగీకరించారని తెలుస్తుంది. తమ పార్టీకి అధిక స్థానాలు కావాలని బీజేపీ నేతలు పట్టుపట్టినా.. చివరికి 60 స్థానాలకు సర్దుకున్నారట.
కాగా ప్రతిష్టాత్మకమైన జూబ్లిహిల్స్ డివిజన్ కోసం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఫోన్ చేయగా, చంద్రబాబు ఆ మేరకు ఈ స్థానాన్ని వారికే కేటాయించాలని సూచించారట. మోదీ అభివృద్ధి నినాదంతో బీజేపీ ప్రచారం చేయాలని, దీంతో పాటు స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటామని భరోసా కూడా ఇవ్వాలని యోచిస్తున్నారు. అటు హైదరాబాద్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు, సెటిలర్ల ఓట్లపై నమ్మకంతో టీడీపీ ముమ్మర ప్రచారానికి తెరతీయనుంది.. గ్రేటర్లో గెలిచేందుకు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.. కాగా వందకు పైగా సీట్లను తాము గెలుస్తామన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఈ కూటమి పార్టీలు ఎలా రాణిస్తాయో వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more