ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల్లో సమరశంఖాన్ని పూరించారు. చాలా కాలం తర్వాత తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో ఎక్కడో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో భారీగా సభను నిర్వహించారు. నిజాం కాలేజీ గ్రౌండ్ వేదికగా చంద్రబాబు నాయుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది ఎవరో గుర్తించుకొని ఓటు వెయ్యాలని ఆయన కోరారు. తెలుగుదేశం-భారతీయజనతా పార్టీ జెండాలు హైదరాబాద్ కోటలో ఎగరాలని.. అందుకు కార్యకర్తలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
‘నేను ఎక్కడికీ పోలేదు. మీతోనే ఉంటాను. మీ వెంటే ఉంటాను. నేను ఇక్కడ తిరగడం లేదని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రిగా నాకు ఉన్న బాధ్యతలు, కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవడానికి చేయాల్సిన విధుల వల్ల నేను మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఎక్కడ ఉన్నా నడిపించేది నేనే’ అన్నారు. ‘పెట్టుబడులు వస్తేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్కు పెట్టుబడుల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల వారిని ఇక్కడకు ఆహ్వానించి వారితో పెట్టుబడులు పెట్టించాను. ప్రపంచం అంతా తిరిగి కంపెనీలను తీసుకువచ్చి ఇక్కడ కార్యాలయాలు పెట్టుకొనే ఏర్పాటు చేశాను. ఇప్పుడు అదే పనిని ఆంధ్రప్రదేశ రాష్ట్రం కోసం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారికి ఏ కష్టం వచ్చినా టీడీపీ, బీజేపీ అండగా ఉంటాయి. మాపై విశ్వాసం ఉంచండి’.. అని చంద్రబాబు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ గెలుపునకు ఈ గ్రేటర్ ఎన్నికలు నాంది కావాలని ఆయన పిలుపునిచ్చారు.మొత్తంగా ఎంతో కాలంగా తెలుగుదేశం క్యాడర్ నిరుత్సాహంగా ఉండటం... చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద పెద్దగా దృష్టిసారించకపోవడంతో టిడిపి కాస్త డీలా పడినట్లు కనిపించింది. కానీ బాబు రాకతో మరోసారి తమ సత్తా ఏంటో చాటుతాం అంటూ తెలుగు తమ్ముళ్లు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more