పార్లమెంట్ లో మన ఎంపీలు దేని గురించి మాట్లాడతారో మీకు తెలిస్తే షాక్ అవుతారు. పార్లమెంట్ ను ఒఓ యుద్దక్షేత్రంగా చేసిన ఎంపీల గురించి, పార్లమెంట్ లో కొట్టుకున్న వారి గురించి.. సభలో చివరకు పెప్పర్ స్ప్రీలు చల్లిన వారి గురించి కూడా విన్నాం. అయితే తాజాగా ఓ ఎంపీగారు అసలు పార్లమెంట్ లో ఎంపీలు ఏం చేస్తారో చెప్పిన విషయాలు వింటే విస్తుపోతారు. ఏంటీ మన ఎంపీలు పార్లమెంట్ లో చేసే పని ఇది అని అనుకుంటారు. అయినా పార్లమెంట్ లో ఏం చేస్తారు అని చెప్పిందో ఎవరో తెలుసా..? శరద్ పవార్ కుమార్తె. అవును ఆమె అన్న మాటలు చదవి విస్తుపోండి..
"నేను పార్లమెంటుకి వెళ్లగానే మొదటి ముగ్గురు మాట్లాడింది వింటాను. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఏం మాట్లాడారన్న దానిపై స్పీకర్ మాట్లాడతారు. ఈ నాలుగో వ్యక్తి ఏం మాట్లాడారన్నది అడిగితే మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే నాకది గుర్తుండదు" అంటూ నవ్వేశారామె. "మీలాగే మేం కూడా అక్కడ ఊసులాడుకుంటూ వుంటాం. చెన్నయ్ నుంచి వచ్చిన ఓ ఎంపీతో నేను పార్లమెంటులో మాట్లాడుతూ వున్నాననుకోండి. ఆ దృశ్యాన్ని మీరు పార్లమెంటు గ్యాలరీ నుంచో, లేక టీవీలోనో చూసి, మేం చెన్నయ్ వరదల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. వాస్తవానికి అదేమీ కాదు, 'మీ చీర ఎక్కడ కొన్నారు? నా చీర ఎక్కడ కొన్నాను?' వంటి ముచ్చట్లే పెట్టుకుంటాం. మీరూ క్లాసులో ఇలాగే ముచ్చట్లాడుకుంటారు కదా?" అంటూ సుప్రియా సూలే విద్యార్థులను నవ్వుతూ ప్రశ్నించారు.
"ఇవన్నీ చూసే పురుష ఎంపీలు అస్తమాను నన్ను ఆటపట్టిస్తుంటారు. 'పార్లమెంటులో మహిళలకు ఏభై శాతం రిజర్వేషన్ వుంటే కనుక ఇక అక్కడ చర్చలన్నీ బ్యూటీ పార్లర్లపైనా, ఫేసియల్స్ పైనా, చీరలపైనా జరుగుతాయి' అంటూ జోకులేస్తుంటారు. దానికి నేను 'మీరు మాత్రం ఏం చేస్తున్నారిప్పుడు... మాకు అలాంటి అవకాశం ఇస్తే కొంపలేమీ అంటుకుపోవులెండి' అంటూ నేనూ సరదాగానే అంటుంటాను" అంటూ చెప్పుకొచ్చారు సుప్రియ. మొత్తానికి విద్యార్థులతో ఈ ముచ్చట్లు ఆమె సరదాకే పెట్టినప్పటికీ, ఇవి పెద్ద దుమారాన్నే లేపేలా వున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల సొమ్ము వెచ్చించి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో దేశ సమస్యలపై చర్చ జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more