నవ్వడం ఒక యోగం. నవ్వకపోవడం ఓ రోగం అని తెలుసుకున్నారో ఏమో కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం నవ్వుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న వీరు ప్రస్తుతం కలివిగా కనిపిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లడం.. కేసీఆర్ చండీయాగానికి చంద్రబాబు రావడం అలా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబందాలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇద్దరు చంద్రులు కలిశారు. కలవడమే కాకుండా మనస్పూర్తిగా నవ్వుకున్నారు. ఇదంతా ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ పసందైన విందు ఇచ్చారు. రాజకీయ ప్రముఖులతో కళకళలాడిన రాజ్ భవన్ పలు ఆసక్తికర సంఘటనలకు నెలవైంది. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిదులుగా హాజరుకావడంతో రాజ్ భవన్ సరికొత్త శోభను సంతరించుకుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే అటు, ఇటు కలియతిరుగుతూ సందడి చేశారు. చిరునవ్వుతో కులాసాగా చాల సేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు పక్కకు వెళ్లి పావుగంటపాటు ఏకాంతంగా కబుర్లు చెప్పుకున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై వారు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సతీసమేతంగా వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒంటరిగానే వచ్చారు. విడివిడిగా వచ్చినా, విందులో మాత్రం కలివిడిగా కనిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more