తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఘనంగా నిర్వహించిన ఆయుత ఛండీయాగంలో చివరి రోజు చిన్న అపశృతి చోటుచేసుకుంది. యాగశాలలో అనుకోకుండా మంటలు చెలరేగడంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అగ్నిప్రమాదం చాలా చిన్నది కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే యాగశాలను చివర్లో పూర్ణాహుతి చెయ్యడం యాగంలో భాగమే అని రుత్వికులు వెల్లడించారు. అయితే యాగం నిర్వహిస్తున్న క్రమంలో విరామం ప్రకటించారు. అలా విరామం ప్రకటించడంతో పండితులు వారి బ్యాగులు సర్దుకొని బయటకు పయనమవుతున్నారు.
ఇదే సమయంలో హోమగుండాల వద్ద మిగిలిన ఆవు నెయ్యిని కొందరు పండితులు ఓ బకెట్లో పోసి పక్కనపెట్టారు. ఆగ్నేయం దిక్కున మొదటి హోమగుండం పక్కన ఉన్న బకెట్లోని నెయ్యిని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా యజ్ఞగుండంలో కుమ్మరిం చేశాడు. దీంతో హోమగుండం నుంచి రెండు మీటర్ల ఎత్తుతో ఒక్కసారిగా మంటలు ఎగిసి రెల్లు గడ్డితో వేసిన పైకప్పుకు అంటుకున్నాయి.
యాగశాల చుట్టూ మూడు ఫైరింజిన్లను సిద్ధంగా ఉంచారు. కానీ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు అవి లోనికి రావటానికి వీలుపడలేదు. ఒక ఫైరింజన్ అయినా లోపలి వైపు ఉండి ఉంటే యాగశాలకు అంటుకున్న మంటలను వెంటనే అదుపుచేసే అవకాశం ఉండేది. చూస్తుండగానే మంటలు యాగశాలలోని మిగతా వైపు వ్యాపించాయి. యజుర్వేద యాగశాలలో వేసిన వందల సంఖ్యలో కుర్చీలు కూడా కాలిపోయాయి. అయితే దానికి ఆనుకునే ఉన్న ప్రధాన యాగశాల వైపు మంటలు రాలేదు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం యాగశాలలో మంటలకు కారణమైంది. ఫలితంగా 15 నిమిషాల్లో వంద యజ్ఞ గుండాలతో కూడుకున్న యాగశాల దగ్ధమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more