ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా రాజధానిలో రైతులు భూములన లాక్కుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో వైసీపీ సభ్యులను చాకచక్యంగా బొల్తా కోట్టించిన టీడీపీ అధినేత.. ఇప్పుడు కాల్ మనీ వ్యవహారంలో కూడా అదే పంథాను ఎంచుకున్నారా..? అంటే అవుననే సమాధానమే వినబడుతుంది. వైసీపీ నేతలను మరోమారు బొల్తా కొట్టించడానికే టీడీపీ యత్నిస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి.
సరిగ్గా ఆ అసెంబ్లీ సమావేశాలను పరిశీలించిన వ్యక్తులకు చంద్రబాబు హావబావాలు, రౌద్రం, అవేశం, శాంతం అన్ని అచ్చుగుద్దినట్టుగా అప్పట్లానే కనబడుతున్నాయి. ప్రతిపక్ష్యాన్ని వ్యూహాత్మకంగా కట్టడి చేయడంలో ఆయన ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేశారు. తమను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, సభలో దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎంకే రక్షణ లేకుంటే ఎవరికి రక్షణ ఉంటుందని బాబు ప్రశ్నించారు.
వైసీపీ సభ్యులు సీఎం కుర్చీ వైపు ఎందుకొస్తున్నారని, మీకు అభ్యంతరం ఉంటే మీ స్థానాల్లో నిల్చుని ప్రశ్నించాలని ఆయన సూచించారు. గత సమావేశాల్లోనూ ఇలాగే ప్రవర్తించారని, వైసీపీ సభ్యులు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రౌడీయిజం చేయాలని చూస్తున్నారా అంటూ బాబు ప్రశ్నించారు. వైసీపీ సభ్యులకు సభ అంటే గౌరవం లేదని బాబు చెప్పారు.
ఇదిలా ఉంటే వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ కోడెల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు వచ్చే ముందు సభా సాంప్రదాయాలు తెలుసుకుని రావాలని సూచించారు. ‘మీకు తెలియదు.. చెప్పేవాళ్లు లేరు.. చెప్పినా వినరు’ అంటూ స్పీకర్ వైసీపీ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు రావడం సరైన పద్ధతి కాదని, కూర్చోవాలని కోడెల సూచించారు. ప్రతిపక్ష నాయకుడి కంటే సభా నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పీకర్ చెప్పారు. సభా నాయకుడి ప్రకటనపై ఏవైనా అభ్యంతరాలుంటే ప్రస్తావించొచ్చని కోడెల సూచించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కౌరవ సభను తలపిస్తున్నాయని ప్రతిపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులో ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నారని, అటువంటి వ్యక్తి ప్రకటన చేస్తే మేం ఎందుకు ఒప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. కాల్ మనీలో ముద్దాయి ముఖ్యమంత్రితో పాటే అసెంబ్లీకి వస్తారని, కానీ అతడిని పోలీసులు అరెస్ట్ చేయరని జగన్ వ్యాఖ్యానించారు. అది కాల్ మనీ కేసు కాదని సెక్స్ రాకెట్ కేసు అని జగన్ చెప్పారు. ఇంత దారుణ పరిస్థితులు ఏపీ అసెంబ్లీలో తప్ప ఎక్కడా లేవని ఆయన అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more