ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు హయాంలో పరిపాలన ఎంతో అమోఘంగా సాగుతోంది.. అద్భుతంగా సాగుతోంది అని ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా నవ్వుకుంటున్నారు జనం. ఎందుకు అలా అనుకుంటున్నారా..? రెండు నెలలు తిరిగితే చాలా చంద్రబాబుతో కనెక్షన్ ఉన్న ఏదో ఒక వివాదం మీడియాలో నానుతోంది. చంద్రబాబు నాయుడు అవినీతిని సహించడు.. తప్పు చేస్తే ఎవరికి వదలరు.. ఇవన్నీ గతంలో మాటలు.. ఇప్పుడు అంతా సొంత లాభం కోసమే నడుస్తోంది. తన పార్టీ నాయకులను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు కేసులను తొక్కిపెడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా మారాడు అన్న కారణాలు ఎవరికి అక్కర్లేదు. కానీ ఇలా మారడం మాత్రం మంచిది కాదు అన్నది మాత్రం క్లీయర్.
Also Read: చంద్రబాబుకు అసెంబ్లీలో చుక్కలే
నాగార్జున యూనివర్సిటిలో ఆర్కియాలజీ విద్యార్థిని రిషితేశ్వరి కాలేజ్ లో ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు హస్తం ఉందని క్లీయర్ అయింది.. కానీ ఆయన మీద ఈగ వాలకుండా.. ప్రతిపక్షాలు ఎంత గొంతుచించుకున్నా కానీ పట్టించుకోకుండా కేసును తొక్కేశారు. గంటా శ్రీనివాస్ గారు మూడు పర్యటనలు.. నాలుగు ప్రెస్ మీట్ లు నిర్వహించి.. ర్యాగింగ్ మీద ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రిషితేశ్వరి కేసు మీద తర్వాత ఎందుకు వార్తలు రాలేదు..? కేసు ఎక్కడికి వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. సరే మొత్తం వ్యవహారానికి ఎవరు కేంద్ర బిందువుగా ఉన్నారా..? అని చూస్తే చంద్రబాబు నాయడు ఖచ్చితంగా కనిపిస్తారు.
Also Read: కాల్ మనీలో చంద్రబాబు డబ్బులు ..?
ఎమ్మార్వో వనజాక్షి మీద ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తాడు.. దాని మీద సర్వత్రా విమర్శలు వస్తాయి.. కానీ చంద్రబాబుకు అవన్నీ కనిపించవు.. ప్రతిపక్షాల విమర్శలను కాకిగోళ కింద కొట్టేస్తారు. పైగా అధికారులను బదిలీ చేస్తారు తప్పితే తమ నాయకులను మాత్రం కనీసం మందలించడం కూడా చేయరు. ఇక విజయవాడలో ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు కూడా అంతే. మృతులకు ఐదు లక్షల రూపాయలు ప్రకటించి.. చర్యలు తీసుకుంటామని మీడియా ముందు హుందాగా మాట్లాడిస్తారు. కానీ దానికి కారణమైన వారి మీద ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు కదులుతోందా అంటే లేనే లేదు.
Also Read: ‘కాల్ మనీ’కి డబ్బులు ఇలా వచ్చాయి.. పూర్తి స్టోరీ ఇదే
ఇక తాజాగా కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకలు ఉన్నారని అందరికి అర్థమవుతోంది. కాల్ మనీ కాటుకు ఎంతో మంది మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.. కానీ చంద్రబాబుకు మాత్రం వారి కన్నీళ్లు కనిపించవు. ఆడవాళ్లకు రక్షణ కావాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలి అంటే ఎన్నికలకు ముందు తీవ్రంగా ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు మాత్రం దీని మీద మాట్లాడరు. అదే నీతిమాలి తిరుగుతున్న నాయకుల ఇంటి వాళ్లు కూడా ఇందులో బాధితులుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పరోక్షంగా కేసులను తొక్కివేస్తూ.. చివరకు సశేషంగానే ముగించేందుకు ప్రయత్నిస్తున్నారని అందరికి అర్థమవుతోంది. ప్రతిపక్షాలు దీని మీద మాట్లాడితే మీరేం తక్కువ.. మీ వాళ్లే వాళ్లు అంటే నీతిమాలి, నీచంగా మాట్లాడుతున్నారు. మరి మిగితా కేసుల్లాగా ఈ కేసు కూడా కంచికి చేరుతుందా..? అంటే అది కాలమే తేలుస్తుంది.
*Abhinavachary*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more