ఇండోనేషియాలోని బాలీ ద్వీపాలో గల జావా ద్వీపం నుంచి నిర్థిష్ట సమయానికి బయలు దేరాల్సిన విమానం చాలా ఆలస్యంగా బయలు దేరింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిం చేస్తున్న ప్రయాణికులందరూ అప్పటికే పైలెట్, సహా విమానసిబ్బంది అందరిపై పీకల్లోతు కోపంతో వున్నారు. ప్రయాణికులను సరదాగా ఆటపట్టించి వారి కోపాన్ని తగ్గిద్దామనుకున్న కో పైలెట్.. వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ బంఫర్ ఆఫర్ కాస్తా రివర్స్ కావడంతో.. ఎక్కడ దోరుకుతాడా..? చితకొట్టేద్దామన్నంత కోపంతో విమానం లాండ్ కాగానే పరుగులు తీశారు ప్రయాణికులు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటనేగా..?
విమానం ఆలస్యమైనందుకు ఆగ్రహించవద్దని, తమ విమానంలో విడాకులు తీసుకున్న ఎయిర్ హోస్టెస్ వుందని ఆలస్యానికి పరిహారం కింద అమెను వాడుకోమని ప్రయాణికులకు దారుణమైన ఆఫర్ చేశాడో కో పైలెట్. లయన్ ఎయిర్ ఫ్లయిట్లో బాలీకి వెళ్తున్నవారికి ఈ విచిత్ర ఆఫర్ వినడంతో వారు ఒంటికాలిపై లేచారు. అప్పటికే ఆ విమానం జావా ద్వీపం నుంచి ఆలస్యంగా బయల్దేరడంతో ఆగ్రహంతో వున్న ప్రయాణికులకు ఈ కుళ్లు జోకు మింగుడు పడలేదు. ఈ ఆఫర్ వారి కోసాన్ని మరింత పెంచింది.
అప్పటికే కాక్పిట్ లోపలి నుంచి మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో లాంబెర్టస్ అనే ప్రయాణికుడికి కోపం తన్నుకొచ్చింది. కో పైలెట్ వ్యహారంపై అతడు రవాణా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. విమానం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్లను ఆఫర్ చేయడం లయన్ ఎయిర్ సంస్థ అనుసరిస్తున్న విధానమా? అని నిలదీశాడు. విమానం ల్యాండ్ కాగానే కోపైలట్ను పట్టుకునేందుకు ప్రయాణికులంతా విఫలయత్నం చేశారు. మరోవైపు లాంబెర్టస్ ఫిర్యాదుపై లయన్ ఎయిర్ అధికారులు స్పందించారు. ఆ కో పైలట్పై విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ పైలెట్ను సస్పెండ్ చేశారు. అయితే కోపైలట్ ముఖానికి అత్యంత దగ్గరగా మైక్ వుందని, కాక్ పిట్ లోంచి వచ్చిన శబ్ధాలు ఆయన శ్వాసనిశ్వాసలని లయన్ ఎయిర్ జనరల్ ఎఫైర్స్ డైరెక్టర్ ఎడ్వట్ సిర్యాట్ తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more