బీహార్ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ, మహాకూటమి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఆవేశంలో పలువురు నేతలు తమ నోటికి బాగానే పనిచెప్పారు. ఎలాగో తామున్నది పెద్ద హోదాలో కాబట్టి ఏం చెప్పిన చెల్లుతుందనే భావనతో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముందు వరుసలో వున్నారు. ఈ ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే వీరు ముగ్గురు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా నిలవడంతోపాటు వివాదాలకూ దారితీశాయి. అందుకే.. వీరి నోటిదూలకు కంచె వేసేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కీలక అడుగు వేసింది. ఆ ముగ్గురు ఎన్నికల నియమావళిని అతక్రమించారంటూ ఎన్నికల సంఘం వారికి నోటీసులు జారీ చేసింది.
ఈ ఎన్నికల ప్రచార నేపథ్యంలో.. ‘ఇక్కడ బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో మతాబులు పేలతాయి’ అని అమిత్ షా కామెంట్ చేసిన విషయం తెలిసిందే! ఆ విధంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల ఈసీ అమిత్ షాకు నోటీసులు జారీ చేసింది. ఇక ‘హిందూ, ముస్లింల మధ్య బీజేపీ గొడవలు పెడుతోంది’ అన్న కామెంట్లపై రాహుల్ కు ఈసీ శ్రీముఖం పంపింది. అలాగే.. మోదీని ‘వాంపైర్’ (రక్తపిపాసి)గా అభివర్ణించిన లాలూకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగం చేసిన బీహార్ అధికార పార్టీ జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను కూడా ఈసీ వదల్లేదు. వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని సదరు నోటీసుల్లో నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా.. బీహార్ ఎన్నికల తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా, చివరి దశల్లో ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు ముగిసేలోపే తాము చేసిన సంచలన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటిసుల్లో ఆయా నేతలకు ఆదేశించింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more