ఏంటి.. ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారా..? కానే కాదు పాతకాలంలో ొక భార్యకు ఎందరో భార్యలు అని విన్నారుగా.. అలాంటిదే చైనాలో చెయ్యాలంటూ ప్రపోజల్ ముందుకు వస్తున్నాయి. ఎందుకు ఇలా అనుకుంటున్నారా..? పాపం అక్కడ బ్రహ్మచారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందట అందుకే చైనా ఈ పాత ప్లాన్ ను తెర మీదకు తీసుకువస్తోంది. 2020 నాటికి చైనాలో బ్రహ్మచారుల సంఖ్య మూడు కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బ్రహ్మచారుల సంఖ్యకు తగినట్లుగా యువతులు లేకపోవడం చైనాలో ప్రధాన సమస్యగా మారింది. ఒక భార్య.. అనేక మంది భర్తలు అనే అంశాన్ని ఆమోదించడమే చైనాలో బ్రహ్మచారుల సమస్యకు సరైన పరిష్కారమని జీజింగ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ఫ్రొఫెసర్ జీ జూషి ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇద్దరు పురుషులు వివాహం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించడం మరో మార్గమని ఆయన సూచించారు. తన ప్రతిపాదనను తన మూడు బ్లాగుల్లో పోస్ట్ చేశారు. ఫ్రొఫెసర్ జీ జూషి చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవ్వడమే కాకుండా పెద్ద దుమారం రేగింది. ఈ ప్రతిపాదన విస్తృతంగా చర్చకు దారి తీసింది.
దాంతో ఈ పోస్ట్ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. తాను ఆర్థిక కోణంలో ఈ సమస్యను చూశానని, ధరల పెరిగినపుడు వస్తువులు సంపన్నులకే అందుబాటులో ఉంటాయని, పేదవారికి లభించడం కష్టం ఉంటుంది. అదే మాదిరిగా యువతల కొరత ఉండి.. బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు స్త్రీల విలువ పెరుగుతుందన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఒకే మహిళను ఇద్దరు వ్యక్తులు వివాహామాడితే తప్పేంటని ప్రశ్నించారు. నైతిక విలువలు మంటగలిపాడంటూ ఈ ప్రతిపాదన చేసిన జీ జూషీకి పెద్ద ఎత్తున్న బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ ప్రతిపాదన చేసింది ఓ మనిషేనా అని నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయినా ఆర్థిక శాస్ర్తం పేరుతో ఇలా వింత వింత ప్రతిపాదనలు చైనాలో చెల్లుతాయని అనుకోవడం జూషీ అతిఅనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more