Tollywood Prince Mahesh Babu Has Adopted Another Village Siddhapuram In Mahabub Nagar District | Srimanthudu Movie

Mahesh babu adopted another village siddhapuram mahabub nagar district

mahesh babu, mahesh babu news, mahesh babu updates, mahesh babu adopt village, mahesh babu adopt another village, mahesh babu siddharpuram vilage, mahesh babu controversy, srimanthudu movie, ktr news, mahesh babu with ktr, ktr latest updates, mahesh babu twitter

Mahesh Babu Adopted Another Village Siddhapuram Mahabub Nagar District : Tollywood Prince Mahesh Babu Has Adopted Another Village Siddhapuram Of Kottur Mandal In Mahabub Nagar District.

మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు

Posted: 09/28/2015 04:21 PM IST
Mahesh babu adopted another village siddhapuram mahabub nagar district

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్.. తాజాగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురాన్ని కూడా దత్తత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన అనంతరం బాగా ఆలోచించిన తర్వాత ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నానని ఆయన తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా వెళ్లాలని తాను చూస్తున్నట్లు మహేష్ చెప్పారు. ఈ విధంగా మహేష్ సిద్ధాపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. తను ‘సర్’ అని పిలవొద్దని, ఇంకా తాను ‘నైట్ హుడ్’కి రాలేదని, అందువల్ల తనని కేటీఆర్ అని పిలిస్తే చాలని మహేష్ ని సరదాగా కోరారు.



ఇదిలావుండగా.. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రభావం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గ్రామాన్ని దత్తత తీసుకునే నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం.. ఎందరో ప్రముఖుల్ని ఆ దిశగా పావులు కదిపేలా చేసింది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఎంపీలను గ్రామాల్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! అయితే.. అప్పట్లో కేవలం కొందరు ఎంపీలు మాత్రమే ముందుకొచ్చారు. కానీ ఈ చిత్రం వచ్చిన తర్వాత గ్రామాల దత్తత విస్తృతంగా పెరుగుతూ వస్తోంది. కేవలం ఎంపీలు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం పలు గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

అలాగే మరో టాలీవుడ్ నటుడైన మంచు విష్ణు కూడా ఏకంగా పది గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిగి మండలంలో వున్న 10 గ్రామాల్ని తాను దత్తత తీసుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆ గ్రామాల అభివృద్ధిలో పనుల్లో విష్ను మునిగిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  First person in the world to live with no heart or pulse
Chandra babu starts padayatra  
Rate This Article
(0 votes)
Tags : mahesh babu  ktr  siddhapuram  srimanthudu movie  

Other Articles