టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్.. తాజాగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురాన్ని కూడా దత్తత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన అనంతరం బాగా ఆలోచించిన తర్వాత ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నానని ఆయన తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా వెళ్లాలని తాను చూస్తున్నట్లు మహేష్ చెప్పారు. ఈ విధంగా మహేష్ సిద్ధాపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. తను ‘సర్’ అని పిలవొద్దని, ఇంకా తాను ‘నైట్ హుడ్’కి రాలేదని, అందువల్ల తనని కేటీఆర్ అని పిలిస్తే చాలని మహేష్ ని సరదాగా కోరారు.
ఇదిలావుండగా.. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రభావం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గ్రామాన్ని దత్తత తీసుకునే నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం.. ఎందరో ప్రముఖుల్ని ఆ దిశగా పావులు కదిపేలా చేసింది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఎంపీలను గ్రామాల్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! అయితే.. అప్పట్లో కేవలం కొందరు ఎంపీలు మాత్రమే ముందుకొచ్చారు. కానీ ఈ చిత్రం వచ్చిన తర్వాత గ్రామాల దత్తత విస్తృతంగా పెరుగుతూ వస్తోంది. కేవలం ఎంపీలు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం పలు గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు.
అలాగే మరో టాలీవుడ్ నటుడైన మంచు విష్ణు కూడా ఏకంగా పది గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిగి మండలంలో వున్న 10 గ్రామాల్ని తాను దత్తత తీసుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆ గ్రామాల అభివృద్ధిలో పనుల్లో విష్ను మునిగిపోయారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more