మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఎట్టకేలకు రెండు కేసుల నుంచి బయటపడ్డారు. గతకొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న ఆ కేసుల్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో చిరు కాస్త రిలాక్స్ గా ఫీలయ్యారని సమాచారం. ఇంతకీ ఆ కేసులేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్ లోకి వెళ్ళాల్సిందే!
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే! ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో వున్నప్పుడు ఆయన తన పార్టీని ప్రచారం చేసే నేపథ్యంలో 2009 ఫిబ్రవరి 19వ తేదీన కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో విస్తృతంగా రోడ్ షో నిర్వహించారు. అయితే.. ఈ రోడ్ షో కారణంగా సాధారణ ప్రజానీకానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో.. చిరంజీవి నిర్వహించిన రోడ్ షో వల్ల సాధారణ ప్రజలకు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలు చేస్తూ ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. ఈ విధంగా తనపై నమోదైన కేసుల్లో నంద్యాల కోర్టులోని విచారణను కొట్టివేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. మరో కేసుకు సంబంధించి కోయిలకుంట్ల జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణను సైతం కొట్టేయాలని చిరు కోరారు.
చిరు వ్యాజ్యాలను పరిశీలించిన హైకోర్టు.. రెండు కేసుల్లో విచారణలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి తీర్పు వెల్లడించారు. ఈ వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపస్తూ.. స్వతంత్ర వ్యక్తి కాకుండా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయన చెప్పిన వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి.. నంద్యాల, కోయిలకుంట్ల కోర్టుల్లోని పిటిషనర్ కు సంబంధించిన కేసుల్లో విచారణలను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more