అది పశ్చిమ బెంగాల్. అందులోనూ మహానగరి కోల్ కతా శివారు ప్రాంతం. ఓ పదహారు ఏళ్ల అమ్మాయి ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తోంది. ఆసలే అ ప్రాంతం నిత్యం వార్తల్లో వుంటుంది. మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిన ప్రాంతమది. రాత్రి అయితే చాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఆడవారు భయపడతారు. ఎప్పుడు ఏవరో ఒకరు వస్తారుగా అనుకుంటూ మహిళల కోసం ఎదురుచూసే మగమృగాళ్లు అక్కడ నిత్యం పోంచివుంటారు. ఒంటరిగా ఆడవారు కనబడితే.. కామంతో విరుచుకుపడతారు.
అలాంటి ప్రాంతంలో ఒంటరి ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్లే సరికి ఆ అమ్మాయిపై కామాంధుల కన్ను పడింది. నడుస్తూ వెళ్లున్న బాలికను సైకిళ్లపై వచ్చిన కామాంధులు అడ్డగించారు. ఆమెపై అత్యాచారం చేయబోయారు. అంతే ఆ పిల్ల కాస్తా అపర కాళీగా మారిపోయింది. పిల్ల కోంచెం గట్టిదంటూ రెచ్చిపోబోయిన కామాంధులకు ఊహించిన రీతిలో విందు బోజనం పెట్టింది బాలిక. అదేంటి అంటారా..? తనకు తెలిసిన కరాటే పంచ్లతో వారి ముఖంపై పిడి గుద్దులు కురిపించింది. ఆమె పంచ్లకు తాళలేక వారిద్దరు పరుగులంకించుకున్నారు. ఇలా ఇద్దరు తాగుబోతు కామాంధులకు తన కారాటేతో బుద్ధి చెప్పింది ఆ బాలిక.
తల్లిదండ్రులు కాదన్నా ఇష్టంతో నేర్చుకున్న కరాటేనే ఆమె మాన ప్రాణాలను కాపాడింది. కరాటే క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలికను సైకిల్పై వెళ్తున్న ఇద్దరు తాగుబోతులు అడ్డగించారు. ఆమెను పట్టుకోబోగా వారి ముఖంపై కరాటే పంచ్లు విరిసింది. ఊహించని ఈ పరిణామానికి వారిద్దరు బిత్తరపోయారు. తిరిగి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈసారి మరింత బలంగా వారి ముఖంపై పంచ్లు విసిరింది. దీంతో రక్త గాయాలతో వారు కుప్పకూలిపోయారు. మెల్లగా లేచి సైకిల్ ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు. దారిన పోయే వారు ఆ బాలిక సాహసానికి ఆశ్చర్యపోయారు. అనంతరం జరిగిన దానిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. స్థానికులైన ఆ ఇద్దరు కామాంధుల కోసం గాలిస్తున్నారు. కరాటే విద్యనే తనకు శ్రీరామ రక్షగా నిలిచిందని ఆ బాలిక ఎంతో ధైర్యంతో చెబుతోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more