తెలంగాణ రాష్ట్రంలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. ఏకకాలంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 బృందాలు చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టుల్లో అక్రమవసూళ్లపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 15 చెక్ పోస్టులున్నాయి. ఏపీ, ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర బోర్డర్ లతో కలుపుకుని చెక్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ చెక్ పోస్టు, నల్గొండ, ఖమ్మం లోని ఆశ్వారావుపేట,కల్లూరు, ఆదిలాబాద్, ఆదిలాబాద్ లోని వాంకిడి, నిజామాబాద్ లోని మద్నూర్, మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టులో సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డుల్లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ క్యాష్ అధికారులకు లభించింది.
ముఖ్యంగా లారీ డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో అవినీతి నిరోధక అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. నల్గొండ జిల్లాలోని.. కోదాడ ఆర్టీఏ చెక్ పోస్ట్ లో సోదాలు నిర్వహించారు. 21 వేల 500 రూపాయల అవినీతి సొమ్ము గుర్తించారు. నిజామాబాద్ లో సలబత్ పూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసిన అవినితి నిరోధక శాఖ.. 44వేల రూపాయలు స్వాధీనం చేసుకుంది. నల్గొండ జిల్లా కోదాడలోనూ 17వేలను పట్టుకున్నారు అధికారులు. మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్ పోస్టుపైనా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారున్న అనుమానంతో ఏసీబీ అధికారులు చెక్ పోస్టులో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలోనూ పలు చెక్ పోస్ట్ లపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో.. వేలల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు చెక్ పోస్ట్ లో 45వేలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, నలుగురు సిబ్బందిని విచారిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more