ఆ మధ్యన కారు కొనడానికి కోట్లు ఖర్చు చేసిన కోటీశ్వరుడు.... బైక్ కొనడానికి లక్షలు వెచ్చించిన సంపన్నుడు.. విలాసాలకు, జల్సాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న బడా బాబులు. ఇలాంటి వార్తలు ఈ మధ్యన సర్వాసాధారణమైపోయాయి. దేశంలో పేదరికం ఇంకా ఉంది అనే వార్త కన్నా దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది అన్న వార్తకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. సరే ఇదంతా ఎందుకు కానీ తాజాగా ఓ బిగ్ ఫ్యామిలీకి చెందిన వార్త హల్ చల్ చేస్తోంది. అంతలా ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా..? ఏమీ లేదు కొన్ని కోట్లు ఖర్చు చేసి వారు ఓ భవనాన్ని కొన్నారు. అయితే ఖరీదంటే మామూలు ఖరీదు కాదు ఏకంగా 425 కోట్ల ఖరీదైన బిల్డింగ్.
భవనం ఖరీదు 425 కోట్లా అని నోరెళ్ల వెళ్లబెడుతున్నారా ? అవును ఇది నిజం. ఇంత డబ్బు పెట్టి ఎవరు కొంటారా ? అని ఆశ్చర్యపడుతున్నారు. మన దేశంలో కుబేరులకు తక్కువా చెప్పండి. ఈ భవంతిని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా' కొనుక్కున్నాడు. ఇంతకు ఈ బిల్డింగ్ ఎక్కడుంది అంటారా ? దేశంలోని ప్రముఖ వాణిజ్యనగరంగా పేరొందిన ముంబై లో ఉంది. ముంబైలోని మలబార్ హిల్ పై జటియా హౌజ్ అనే భవంతి ఉంది. దాదాపు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. ఈ భవనం విక్రయించడానికి వేలం పెట్టారు. ఈ వేలంలో భవంతిని దక్కించుకోవడానికి చాలా మందే పోటీ పడ్డారు. చివరకు కుమార మంగళం బిర్లా 425 కోట్లు పెట్టి ఈ భవంతిని దక్కించుకున్నారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పది శాతం మొత్తాన్ని బిర్లా చెల్లించారని, మిగతాది త్వరలోనే ఇవ్వనున్నారని వేలం పాట నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ పేర్కొంది. ఇదే ప్రాంతంలోని మహేశ్వరీ హౌస్ 2011లో 400 కోట్లకు అమ్ముడు పోగా జటియ హౌస్ కు సమీపంలోని హోమీ హౌస్ 372 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఈ రికార్డులను బిర్లా బద్దలు కొట్టారన్నమాట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more