తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారు. మాట తప్పడం అంటే పోనీలే అని అనుకుంటున్నారేమో మాటిచ్చింది ఎవరికో తెలుసా..? తిరుపతి వెంకన్న స్వామి కి మొక్కులు చెల్లిస్తానని కేసీఆర్ చెప్పినా కానీ ప్రస్తుతం మాత్రం దానికి పంగనామాలు పెట్టేశారు. కరీంనగర్ వేములవాడ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి గతంలో మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ తిరుపతి వెంకన్నకు మొక్కులు చెల్లించడంలో మాత్రం విఫలమవుతున్నారు. యాదగిరి గుట్ట అభివృద్ది కోసం చేస్తున్న హడావిడి అందరికి తెలిసినా తిరుపతి వెంకన్న మొక్కుల మీద మాత్రం ఎక్కడా చర్చకు రావడం లేదు. అసలు తిరుపతి వెంకన్నకు కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోండి.
తెలంగాణ ఉద్యమం తారా స్థాయిలో ఉంది.. ఉద్యమం ఎంతో ఉద్రృతంగా సాగుతున్నా.. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటానని నాటి ఉద్మమ సారధి, ప్రస్తుత తెలంగాణ సిఎం కేసీఆర్ మొక్కులు మొక్కారు. అయితే మొత్తానికి రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైంది. తర్వాత ఎన్నికలు జరిగాయి తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ సిఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే అంతా ముగిసింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి తాను మొక్కిన మొక్కులు చెల్లించారు. కానీ అందులో తిరుపతి వెంకన్న స్వామికి చెల్లించాల్సిన మొక్కును మాత్రం గాలికి వదిలేశారు. 5 కోట్ల రూపాయల విలువైన నగలను తిరుపతి స్వామి వారికి చెల్లిస్తానని అందుకు గాను నిధులు కూడా విడుదల చెయ్యాలని చర్యలకు దిగారు కేసీఆర్. కానీ ఫిబ్రవరిలో ఐదు కోట్ల విడుదలకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. కానీ అది ప్రతిపాదనల స్టేజ్ లోనే ఉండిపోయింది. తిరుపతి వెంకన్న స్వామికి చెల్లించాల్సిన మొక్కల విషయంలోనే కేసీఆర్ ఇలా నిర్లక్షంగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు అని కొంత మంది హెచ్చిరస్తున్నారు. కేసీఆర్ వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసి తిరుపతి వెంకన్న ఆశిస్సులు పొందాలని కేసీఆర్ శ్రేయోభిలాషులు కూడా కోరుకుంటున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more