ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో గుజ్జర్ల తరహా ఉద్యమం ఊపందుకుంది. గుజరాత్లోని పటేల్ సామాజిక వర్గం పోరాటం సాగిస్తోంది. ఓబీసీ కోటా కావాలని డిమాండ్ చేస్తున్న పటేళ్లు..ఉద్యమాన్ని తీవ్రం చేశారు. అహ్మదాబాద్ లో పటేళ్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఓబీసీ కోటా ఇవ్వకపోతే...ఇకముందు గుజరాత్లో కమలం వికసించేది లేదంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నారు. గుజరాత్ లో పటేల్ కమ్యూనిటీ ఆందోళన ఇది.... రాజస్థాన్ గుజ్జర్ల తరహాలో రిజర్వేషన్ కోసం ఉద్యమరూపంలో విరుచుకుపడుతున్నారు పటేల్ సామాజిక వర్గం. గుజరాత్ అంతటా...ఇప్పుడు పటేల్ కమ్యూనిటీని..ఓబీసీల్లో చేర్చాలన్న డిమాండ్ పైనే చర్చజరుగుతోంది. అయితే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించలేమని సీఎం ఆనంది బెన్ పటేల్ స్పష్టం చేశారు. సుప్రీం నిర్దేశించిన కోటామేరకు ఇప్పటికే అమలవుతోందని...పటేల్ కమ్యూనిటీని, ఓబీసీ కోటాలో చేసే అవకాశం లేదని తేల్చిచెప్పింది. సర్కార్ ప్రకటనతో పటేల్ సామాజిక వర్గం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. పటీదార్లని పిలుచుకునే పటేల్ గ్రూపులన్నీ ఒక్కటయ్యాయి.
గుజరాత్ ముఖ్యపట్టణమైన అహ్మదాబాద్లో పటేల్ సైన్యమంతా మోహరించింది. ఇసుకేస్తే రాలనంత జనం. రిజర్వేషన్ ఉద్యమానికి జనాన్ని కూడగట్టడం ఏమంత కష్టంకాలేదు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చారు..పటేళ్లు! ఇదే సభా ముఖంగా గట్టి హెచ్చరికే జారీచేశారు. ముప్పై ఏళ్ల కిందట..కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాం. బీజేపీకి అధికారం అప్పగించాం. 2017లో మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఈలోగా తమను ఓబీసీలో చేర్చకపోతే...రాష్ట్రంలో కమలం వికసించేది లేదంటూ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ కావాలంటూ సాగుతున్న ఉద్యమాన్ని కేంద్రం కూడా ఓ కంట గమనిస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం... ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. ఇక నేడు చేపడుతున్న గుజరాత్ బంద్ మీద ఒకింత టెన్షన్ వాతావరణం ఉంది. గుజరాత్ బంద్ కు పిలుపునిస్తూ పటేల్ సామాజిక వర్గం ఇచ్చిన పిలుపు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more