ఏపీ ఆశల చిట్టాతో హస్తినలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడు.. ప్రధాని సహా ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం అందించాలని మంత్రులందర్నీ కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఒక్క రోజు ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రులతో వరుసగా మీట్ అయ్యారు. మొదట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అక్కడికే రావడంతో ఆయనతో కూడా భేటీ అయ్యారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరారు బాబు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు రాజ్ నాథ్.వెంకయ్య, రాజ్ నాథ్ తో భేటీ తర్వాత ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, కేంద్రం సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదతర అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని మోడీని కోరారు సీఎం. విభజన చట్టం అమలు, రాష్ట్ర పరిస్థితులు, పెండింగ్ సమస్యలపై చర్చించారు. ప్రధానితో భేటీలో అరుణ్ జైట్లీ, నీతి అయోగ్ సీఈవో కూడా పాల్గొన్నారు. వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు కూడా వివిధ అంశాలపై చర్చించారు. ఫైనల్ గా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు అరుణ్ జైట్లీ. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ లాగా.. హస్తినలో భేటీలు బాగానే జరిగినా.. కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు. ఆర్థికసాయం ఏ విధంగా ఉంటుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే.. బీహార్ ఎన్నికల తర్వాత మోడీ ప్రకటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాగా ఈ రోజు కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. నేటి సాయంత్రం జరిగే కేంద్ర మంత్రి వర్గ భేటీలో కూడా ఏపి అంశాలను చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. మరి హస్తిన నుండి తీపి కబురుతో చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారా..? అన్నది మాత్రం అనుమానంగానే కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more