బాగా ఫేమ్ ఉన్న పొలిటికల్ నేత ఎవరైనా ఉంటే అతని ఇలాకాలో జరిగే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మంగా జరుగుతాయి. పరువు కోసం పాపం వాళ్లు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక పొలిటికల్ పార్టీల లీడర్లు అయితే మరీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే రాజస్థాన్ లో పాపం ముఖ్యమంత్రిగారి గాలి తీసేశారు స్థానికులు. ఎన్నికల్లో గెలవకపోతే ప్రతిపక్షాలకు దొరికిందే అదును.. అధికార పక్షం మీద ఆ నేతల మీద తిట్ల దండకం మొదలుపెడతారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పరిస్థితిత అచ్చం ఇలానే ఉంది. అమ్మగారి హవానో.. లేదంటే ప్రధాని మోదీ హవానో గానీ సార్వత్రిక ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ చర్మిషా ఎన్కని రోజులు పని చేస్తుంది చెప్పండి అందుకే పాపం అమ్మగారి పని అయిపోయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గాలి తీసేశారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవడంలో వసుంధర రాజే, పార్టీ నాయకత్వం విపలమైంది. పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కన్ను లొట్ట పడ్డచందంగా తయారైంది. పేరుకేమో అధికారంలో ఉన్నా కానీ కనీసం విలువ కాపాడుకేనేలా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడంలో వసుంధర రాజే విఫలమయ్యారు. మొత్తం 129 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 60 చోట్ల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, ప్రతిపక్ష పార్టీలు 69 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. గతేడాది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో అసాధారణస్థాయిలో పుంజుకుంది. 40 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన ఆ పార్టీ, మరో 17 చోట్ల బీజేపీతో దాదాపు సరిసమానంగా సీట్లు సాధించింది. 129 మున్సిపాలిటీల్లో మొత్తం 3,351 వార్డులకు ఈ నెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఇందులో ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రులు కలిసి 1908 వార్డులు కైవసం చేసుకోగా, బీజేపీ 1443 వార్డులతో సరిపెట్టుకుంది. చావు తప్పి కన్నులొట్టపోవడం అంటే ఇదే మరి. వసుంధర రాజే మరి ఇక ముందు ఇలాంటి ఫలితాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more