థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఓ హిందూ ఆలయం బయట భారీ పేలుడు సంభవించింది. స్థానిక ఎరవన్ ఆలయం వద్ద జరిగిన భారీ పేలుడులో 27 మంది మృత్యువాత పడగా, నలుగురు విదేశీయులు సహా 117 మంది పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత 40 మీటర్ల మేరకు ఉందని అధికారులు తెలిపారు. థాయ్ రాజధానిలో ఇలాంటి పేలుడు తొలిసారి చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలమంతా హృదయవిదారకంగా మారింది. పేలుడు ప్రభావంతో మోటారు వాహనాలన్నీ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో లభ్యమైన రెండో బాంబును నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని, క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించామని అధికారులు తెలిపారు.
బ్యాంకాక్లోని ప్రధాన వాణిజ్య కూడలి, మూడు షాపింగ్ మాల్స్, హయత్ ఫైవ్స్టార్ హోటల్కు సమీపంలో ఉన్న ఎరవన్ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు, విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు. పేలుడుకు ఉపయోగించిన బాంబు టీఎన్టీ బాంబ్. పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అని థాయ్లాండ్ రక్షణశాఖ మంత్రి ప్రవిత్ వాంగ్సువాంగ్ మీడియాతో అన్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ప్రయుథ్ చాన్ ఓచా వార్ రూంను ఏర్పాటు చేశారు. మోటారు వాహనానికి బాంబు బిగించి బాంబును పేల్చివేశారని, ఎలక్ట్రిక్ పోల్కు కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more