శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుత శతకాలను నమోదు చేయడంతో.. మ్యాచ్ పై భారత్ పట్టుబిగించింది. శ్రీలంక జట్టును తొలి రోజునే భారత స్పిన్ మాయాజాలం అలౌట్ చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లను క్రమంగా పెవిలీయన్ పంపడంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లోనే అత్యుత్తమంగా రాణించి ఆరు విక్కెట్లను సాధించాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్.. ఇందులోభాగంగా 2 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో పాటు టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలు సెంచరీలతో కదం తొక్కారు.
రెండు వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... ఏమాత్రం పట్టుసడలించకుండా లంక బౌలర్లను ఉతికి అరేసింది. లంక బౌలర్ల గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ.. ధీటుగా బ్యాటింగ్ కొనసాగించింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 178 బంతుల్లో పది ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఇది ధావన్కు ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్ లో 11వ టెస్టు సెంచరీని నమోదు చేసుకున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more