రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హస్తినలో బిజీబిజీగా గడిపిన ఆనయ మీడియాతో మాత్రం తనదైన తరహాలో చమత్కరించాడు. శనివారం ఉదయం కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ అయిన తరువాత భయటకు వచ్చిన ఆయనను మీడియా పలుకరించగా, మీడియా ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. హోంశాఖ కార్యదర్శితో. ఏ అంశాలపై మాట్లాడారన్నమీడియా ప్రశ్నకు జాతీయ, అంతర్జాతీయ విషయాలు చర్చించామని గవర్నర్ చమత్కరించారు.
ఆ తరువాత ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాత్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో ఎలాంటి సమస్యలు లేవని ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. మీడియానే ఈ సమస్యలను సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ బిజీబిజీగా ఉన్నారు. రెండు రాష్ర్టాల్లోని తాజాపరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కూడా సాయంత్రం గవర్నర్ సమావేశంకానున్నారని తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more