జింబాబ్వేతో జరుగుతున్న రెండోవన్డే మ్యాచ్ లో టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఎనమిది విక్కెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెప్ అజింక్యా రహేనే.. సహా మురళి విజయ్ లు అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్ బరిలోకి దింపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒపెనర్లు రహానే, మురళీ విజయ్ 112 పరుగుల వరకు విక్కెట్ కోల్పోకుండా శుభారాంబాన్ని ఇచ్చారు. 112 పరుగుల వద్ద కెప్టెన్ రహానే 63 పరుగుల వ్యక్తిగత స్కోర్కు వద్ద అవుట్ అయ్యి పెవీలియన్ కు చేరుకున్నాడు.
ఆ తరువాత బరిలోకి వచ్చిన అంబటి రాయుడుతో కలసి మురళీ విజయ్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ కూడా వెనుదిరిగాడు. తొలి వన్డేలో శతకాన్ని బాదిన తెలుగు తేజం అంబటి రాయుడు ఈ మ్యాచ్ లోనూ 41 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఆ తరువాత భారత్ క్రమంగా విక్కెట్లను కోల్పయింది. మనోజ్ తివారీ 22 పరుగులు, రాబిన్ ఉత్తప్ప 13 పరుగులు, కెదర్ జాదవ్ 16 పరుగులతో వెనుదిరిగారు. తొలివన్డేలో అంబటిరాయుడితో జతకట్టి రాణించిన స్టువర్ట్ బిన్నీ కూడా 25 పరుగులకే వెనుదిరిగాడు.
దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి హర్భజన్ సింగ్ ఐదు పరుగులతో, భువనేశ్వర్ కుమార్ ఖాతా తెరవకుండా.. నాటౌట్ గా క్రీజ్ లో వున్నారు. మొత్తానికి ఎనిమిది వికెట్లను కోల్పయిన టీమిండియా 271 పరుగులు సాధించింది. జింబాబ్వే జట్టులో మజ్దీవా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్ తో రాణించాడు. 49 పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగోట్టాడు. డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ, బ్రాయన్ విటోరి, సికిందర్ రజ చెరో వికెట్ ను సాధించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more